USA: వెంటనే నిర్మూలించడం..ఉగ్రవాదంపై పాక్ కు అమెరికా అల్టిమేటం

ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని...ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని అమెరికా చట్ట సభ్యుడు బ్రాడ్ షెర్మన్ అన్నారు. లాడెన్ ను పట్టించిన సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీకి సాయం చేసిన డాక్టర్‌ షకీల్‌ అఫ్రీదీని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

New Update
us

US Congressman Brad Sherman has urged Islamabad to act decisively against the terror outfit Jaish-e-Mohammed

  ప్రస్తుతం మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో నేతృత్వంలో పాకిస్తాన్ అఖిల పక్ష బృందం అమెరికాలో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా అక్కడి చట్టసభ్యుడు బ్రాడ్ షెర్మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని...ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని షెర్మన్ అన్నారు. లాడెన్ ను పట్టించిన సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీకి సాయం చేసిన డాక్టర్‌ షకీల్‌ అఫ్రీదీని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

వెంటనే చర్యలు తీసుకోండి.. 

ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాలని...దాన్ని సమూలంగా నిర్మూలించడానికి పాకిస్తాన్ కృషి చేయాలని షెర్మన్ చెప్పారు. ముఖ్యంగా 2002లో డేనియల్ పెర్ల్ అనే వ్యక్తిని హత్య చేసిన జైషే మహ్మద్ సంస్థను పాక్ అంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. డేనియల్‌ను ఉగ్రవాది ఒమర్‌ సయీద్ షేక్ కిడ్నాప్‌ చేసి హత్య చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇక ఒసామా బిన్ లాడెన్ చనిపోయిన దగ్గర నుంచి డాక్టర్ షకీల్ పాకిస్తాన్ జైల్లో మగ్గుతున్నారు. లాడెన్‌ కుటుంబసభ్యులకు సంబంధించిన డీఎన్‌ఏ నమూనాలను సేకరించేందుకు సీఐఏ పోలియో టీకా కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆయన సాయం చేశారు. ఆ తర్వాత లాడెన్ ను అమెరికా హతమార్చింది. ఇదంతా అఫ్రీది వల్లనే జరిగిందని పాక్ అధికారులు అతనని అరెస్ట్ చేశారు. అక్కడి కోర్టు అఫ్రీదికి 33 ఏళ్ళ జైలు శిక్ష విధించింది.   

 

Also Read: పర్సు కొట్టేసిన కోతి...పర్సులో రూ.20 లక్షల విలువైన నగలు..తర్వాత ఏం జరిగిందంటే..

Advertisment
Advertisment
తాజా కథనాలు