Trump: అమెరికా, చైనా మధ్య కీలక ఒప్పందం.. ట్రంప్‌ సంచలన ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. చైనా.. వాణిజ్య ఒప్పందంలో భాగంగా అమెరికాకు అరుదైన ఖనిజాలను ఎగుమతి చేసేందుకు ఒప్పుకుందని పేర్కొన్నారు. అలాగే తాము కూడా చైనా విద్యార్థులకు వీసాలు జారీ చేస్తామని తెలిపారు.

New Update
Trump and Jinping

Trump and Jinping


ఇటీవల అమెరికా, చైనా టారిఫ్‌ల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందం జరిగింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ వెల్లడించారు. చైనా.. వాణిజ్య ఒప్పందంలో భాగంగా అమెరికాకు అరుదైన ఖనిజాలను ఎగుమతి చేసేందుకు ఒప్పుకుందని పేర్కొన్నారు. అలాగే తాము కూడా చైనా విద్యార్థులకు వీసాలు జారీ చేస్తామని తెలిపారు. ఈ మేరకు ట్రూత్‌ సోషల్‌లో ట్రంప్‌ పోస్ట్ చేశారు.   

Also Read: 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. !

'' మేము చేసుకున్న ఒప్పందం చైనాతో పూర్తయింది. ఫుల్‌ మ్యాగ్నెట్స్‌తో పాటు అవసరమైన అరుదైన ఖనిజాలు అమెరికాకు ఎగుమతి చేసేందుకు చైనా అంగీకరించింది. అమెరికా కాలేజీలు, యూనివర్సిటీల్లో చైనా విద్యార్థులు చదువుకునేందుకు మేము కూడా ఒప్పుకున్నామని'' ట్రంప్ తెలిపారు. ఈ డీల్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఆమోదమే మిగిలి ఉందన్నారు. అలాగే తమ వాణిజ్యానికి చైనాకు తలుపులు తెరిచేందుకు జిన్‌పింగ్, తాను కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. ఇరుదేశాలకు ఇది గొప్ప విజయమవుతుందని పేర్కొన్నారు. 

Also Read: ట్రంప్‌తో గొడవలు.. పశ్చాత్తాపం చెందిన ఎలాన్ మస్క్

మరోవైపు అమెరికా, చైనా మధ్య టారిఫ్‌ వార్‌ నెలకొన్న నేపథ్యంలో అరుదైన ఖనిజాల ఎగుమతిని చైనా నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆటోమోటివ్స్, డిఫెన్స్ రంగాలకు ఇవే కీలక పాత్ర పోషిస్తాయి. ట్రంప్‌ ముందుగా చైనాతో సహా అన్ని దేశాలపై భారీగా టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చైనా అరుదైన ఖనిజాల ఎగుమతిని నిలిపివేయడంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఈ క్రమంలోనే ఇరు దేశాలు కాస్త వెనక్కి తగ్గాయి. గత రెండ్రోజులగా లండన్‌లో వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ట్రంప్‌.. చైనాతో ఒప్పందం కుదిరిందని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.  

Also Read: ట్రంప్‌తో గొడవలు.. పశ్చాత్తాపం చెందిన ఎలాన్ మస్క్

 

Advertisment
Advertisment
తాజా కథనాలు