/rtv/media/media_files/2025/05/31/2YYg9ZJ7JezDBuYExIdQ.jpg)
Indians Missing In Iran
ఏమైపోయారో తెలియకుండా పోయిన భరతీయ యువకులను ఇరాన్ పోలీసులు రక్షించారు. దుంగులు వారిని కిడ్నాప్ చేయగా...వారి నుంచి కాపాడి బయటకు తీసుకువచ్చారు. ఈ విషయాన్ని ఇరాన్ ఎంబసీ కన్ఫార్మ్ చేసింది. ఎక్స్ లో పోస్ట్ పెట్టింది. దీంతో బాధిత కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే ముగ్గురు యువకులనూ ఎవరు కిడ్నాప్ చేశారు. ఎందుకు చేశారు అన్న విషయాలు మాత్రం ఇంకా తెలియలేదు.
Three missing Indian citizens freed by Tehran police
— Iran in India (@Iran_in_India) June 3, 2025
Local media in Iran say police have found and released three Indian men who had gone missing in Iran.https://t.co/YAkirkKRHg
టెహ్రాన్ లో అడుగు పెట్టగానే కిడ్నాప్..
సంగ్రూర్కు చెందిన హుషాన్ప్రీత్ సింగ్, ఎస్బిఎస్ నగర్కు చెందిన జస్పాల్ సింగ్, పంజాబ్లోని హోషియార్పూర్కు చెందిన అమృత్పాల్ సింగ్ అనే ముగ్గురు వ్యక్తులు మే 1న ఇరాన్ మెయిన్ ఎయిర్ పోర్ట్ టెహ్రాన్లో దిగిన కొద్దిసేపటికి అదృశ్యమయ్యారు. వీరు ముగ్గురూ ఏజెంట్లను నమ్మి మోసపోయారు. బాధితులను ఇరాన్ ద్వారా ఆస్ట్రేలియా పంపుతామని చెప్పారు. కానీ ఇరాన్ వెళ్ళాక వాళ్ళు కనిపించకుండా పోయారు. యువకులు కిడ్నాప్ అయ్యాక హోషియార్పూర్ లో ఉన్న ఈ ఏజెంట్ ప్రస్తుతం కనిపించకుండాపోయాడు. తరువాత దుండగులు బంధించి వాళ్లను తాళ్లతో కట్టి.. కుటుంబ సభ్యులకు ఫొటోలు పంపించి రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. మే 11 తరువాత అసలు ఏ సమాచారం కూడా తెలియలేదు. దీంతో కుటుంబసభ్యులు టెహ్రాన్ లోని భారత ఎంబసీని సంప్రదించారు. ఎంబసీ అధికారులు.. ఇరాన్ ప్రభుత్వానికి సమాచారం అందించారు. భారతీయుల జాడ గుర్తించాలని కోరారు. మొత్తానికి అక్కడి పోలీసులు ప్రయత్నంతో యుగ్గురు యువకుల కథ చివరకు సుఖాంతం అయింది.