Harish Rao : వ్యక్తిగత పనుల నిమిత్తం లండన్ వెళ్లిన మాజీ మంత్రి తన్నీరు హరీష్రావు అక్కడ ఎన్ఆర్ఐలు నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పాలకులకు పాజిటివ్ ఆటిట్యూడ్ లేకపోవడం వల్లే రాష్ట్రం అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. ఈరోజు పాలకులే నెగిటివ్ మైండ్ సెట్ తో ఉంటే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ గురించి మాట్లాడుతూ ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ పార్టీ మొదట పుట్టిందే లండన్ లోనే అని.. యూకే ఎన్నారైల వల్లే ప్రపంచవ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ వ్యాప్తి చెందిందన్నారు.మన సంస్కృతి, సాంప్రదాయాలు, బతుకమ్మ లాంటి పండుగలను ప్రపంచానికి చాటి చెప్పింది కూడా ఇక్కడి నుండేనన్నారు.. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణలో మేము నిరసన కార్యక్రమాలు, ఉద్యమాన్ని చేస్తున్నప్పుడు ఆ ఉద్యమాన్ని ఈ గడ్డపై కూడా చేసింది మీరేనన్నారు. కేసీఆర్ కు మద్దతిచ్చి రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన మీ అందరికీ తెలంగాణ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అనేక అద్భుతాలు సాధించిందని, ఒకప్పుడు దేశంలో నానుడి ఉండేది. బెంగాల్ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అని ఉండేది.. కానీ కేసీఆర్ పాలనతో తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అని కాడికి తెచ్చామన్నారు.గత 10 ఏండ్లలో.. గూగుల్లో సెర్చ్ చేసినా మీకు తెలుస్తుంది పర్ క్యాపిటా ఇన్కమ్ లో తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ఉందన్నారు.పర్ క్యాపిటా పవర్ వాడకంలో ఇండియాలో తెలంగాణ టాప్. జీఎస్డీపీ గ్రోత్ లో తెలంగాణ రాష్ట్రానికి దరిదాపులో కూడా ఏ రాష్ట్రం లేదు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు నల్ల ద్వారా అందించింది కేసీఆర్. మ్యానిఫెస్టోలో పెట్టుకోకపోయినా ఇంటికి తాగునీరు అందించిన గొప్ప నాయకుడు కేసీఆర్. అసెంబ్లీలో వచ్చే ఎన్నికల నాటికి ప్రతి ఇంటికి నల్ల ద్వార నీళ్ళియకపోతే ఓట్లు అడగను అని చెప్పిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని గుర్తు చేశారు.మిషన్ భగీరథ కార్యక్రమంతో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించి చూపించారన్నారు.
తెలంగాణ రాకముందు హైదరాబాదులో ఇండస్ట్రీస్ కి పవర్ హాలిడేస్ ఇచ్చేవారు. 4 గంటలకు మించి కరెంటు కట్ ఉండేది. గ్రామీణ ప్రాంతంలో 6 గంటల నుంచి 8 గంటల పవర్ కట్ ఉండేది. అరవై ఏళ్లలో కానీ పనిని కేసీఆర్ ఒక్క సంవత్సరంలో సాధించి 24 గంటల నాణ్యమైన కరెంటును ఇచ్చారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉదయం లేవగానే పవర్ పై సమీక్ష చేసి పవర్ కొనుగోలు టైమ్స్ ని చూసేవారు. తర్వాత మిషన్ భగీరథ ప్రోగ్రెస్ చూసేవాడు. డెడికేషన్ గా పనిచేసేవారు. ఫోకస్డ్ గా పనిచేయడం వల్ల తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని హరీష్రావు తెలిపారు.
మిషన్ భగీరథను ఆదర్శంగా తీసుకొని సర్దార్ కోచలాని కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు.పదేండ్లయినా కూడా భారతదేశంలో హర్ ఘర్ జల్ పూర్తి కాలేదు కానీ మూడు ఏండ్లలో మిషన్ భగీరథను పూర్తి చేసుకున్నామన్నారు. మిషన్ కాకతీయ మనందరం ఎక్కడో ఏదో గ్రామం నుంచి వచ్చిన వారమే.. మన ఊర్లలో ఉండే చెరువువులు ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైంది..చెరువుల్లో నీళ్లు బాగుంటే గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది వ్యవసాయానికి సాగునీరు, తాగునీరు అందుతాయి.. దాదాపు 30 వేల చెరువులను మూడు సంవత్సరాల్లో రిజిస్టర్ చేసాం.. ఈ కార్యక్రమం మొత్తం దేశం దృష్టినే ఆకర్షించిందన్నారు.కేంద్రం అమృత సరోవర్ కార్యక్రమాన్ని చేపట్టి అధ్యయనం చేయడానికి రాష్ట్రానికి అధికారులను పంపించిందన్నారు.
రైతుల కోసం దేశంలోనే నేరుగా నగదు బదిలీ చేసిన ఒకే ఒక కార్యక్రమం రైతుబంధు.. వాచ్మెన్ జాబ్ చేసినా పిల్లని ఇస్తారు కానీ రైతు అంటే పిల్లని ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. వ్యవసాయం అంటే చిన్నచూపు అయింది.అలాంటి పరిస్థితుల నుండి కేసీఆర్ రైతుబంధు అని ఒక కార్యక్రమం చేపట్టి.. ప్రతి సంవత్సరం 10000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవారు. 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు వ్యవసాయానికి అందించారు.. సాగునీరుని అందించడం ద్వారా వ్యవసాయం లాభసాటిగా మారిందన్నారు 2014కి ముందు ఎక్కడ చూసినా రెండు మూడు లక్షలకు మించి ఎకరం ఉండేది కాదు..ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ కూడా 30 నుండి 50 లక్షల ఎకరం తక్కువ లేదని హరీష్రావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి పీఎం కిసాన్ అని చేపట్టిందన్నారు. విద్యుత్ వినియోగమైనారోడ్ ట్రాన్స్ఫోర్ట్ అయినా, ఏ కార్యక్రమమైనా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.
భారత దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 7.7% గ్రీన్ కవర్ ని పెంచి ఇండియాలో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. గ్రీన్ కవర్ పెంచడం ద్వారా ఓట్లు రావు. జనరల్గా రాజకీయ నాయకులు పచ్చదనంపై దృష్టి సాధించరు. కానీ భవిష్యత్ తరాల కోసం పచ్చదనాన్ని అందించిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని స్పష్టం చేశారు.అదేవిధంగా ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దారని హరీష్రావు గుర్తు చేశారు.
ఎలక్షన్ల ముందు ఒక ఆయన కేసీఆర్ 24 గంటలు కరెంటు ఇచ్చిండు నేను 48 గంటలు కరెంటు ఇస్తా అని చెప్పిండు.. ఎన్నికల ముందు ఏది పడితే అది మాట్లాడారు. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలు ఇస్తున్నారు కదా మేము తులం బంగారంతో పాటు లక్ష రూపాయలు ఇస్తామన్నారు.. ఆంధ్రాలో ఒక ఎకరా అమ్మితే తెలంగాణలో పదెకరాలు వచ్చేది అని అనేవారుఒకప్పుడు.. ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఆంధ్రలో పది ఎకరాలు కొనవచ్చు..ఇప్పుడు 10 లక్షలు తక్కువకు అమ్ముదామంటే ఎవరూ కొనేవాళ్లు లేకుండా పోయిందని హరీష్ రావు అన్నారు. దీనికి కారణం ఒక పాజిటివ్ ఆటిట్యూడ్ లేకపోవడమే అన్నారు.
కేసీఆర్ తెలంగాణ ఓ గొప్ప రాష్ట్రంగా అభివృద్ధి జరుగుతున్నది అని చెప్పేవారు. ఈరోజు పాలకులే నెగిటివ్ మైండ్ సెట్ తో ఉంటే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.ఈ సందర్భాల్లో మనం కూడా చిన్న చిన్న తప్పులు చేసినా వాటిని కూడా మేము సరి చేసుకుని అందుకు వెళ్తున్నాం. హెల్త్ లో కూడా మదర్ అండ్ చైల్డ్ మరణాల రేట్ తగ్గిస్తూ దేశంలో మూడో స్థానంలో వచ్చాము. టీఆర్ఎస్ ఉండి ఉంటే ఈపాటికి నెంబర్ వన్ అయ్యేవారు. ఇప్పుడున్న ప్రభుత్వం పర్ఫామెన్స్పై దృష్టి సాధించకుండా గూగుల్ ప్రచారంపై దృష్టి సారించడం దురదృష్టం అన్నారు.తెలంగాణలో ఈరోజు అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. ఏ శాఖలో చూసిన అవినీతి పెరిగిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు.
కాళేశ్వరం అంటే లక్ష లక్ష కోట్ల రూపాయలు పోయాయని దుష్ప్రచారం.. కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు బారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్ లు, 21 పంపు హౌస్ లు, 203 కిలోమీటర్ల టన్నెలు, 1500 కిలోమీటర్స్ గ్రావిటీ కెనాల్, 98 కిలోమీటర్స్ గ్రావిటీ కెనాల్ 600 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేయడం.. గత సంవత్సరం ఈ సంవత్సరం మంచి వర్షపాతం ఉండె. ఎస్సారెస్పీ నుండి మిడ్ మానేరుకు నీళ్లు వస్తాయి.. కాళేశ్వరం మోటర్లను మిడ్ మానేరు నుండి ఆపరేట్ చేస్తాం. 37 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు వస్తాయి. యావరేజ్ రైన్ ఫాల్ ఉన్న ఇయర్లో ఎల్లంపల్లి నుండి కాళేశ్వరం మోటర్లు ఆన్ చేసుకుంటే అక్కడినుంచి నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. బ్యాడ్ ఇయర్.. ఎక్కడ వర్షపాతం లేకున్నా మేడిగడ్డ వద్ద నీళ్లు ఉంటాయి.. ఎంత క్రైసిస్ వచ్చినా అక్కడ నీళ్లు ఉంటాయి.. 37 లక్షల ఎకరాలకు సాగునీరు 60% తెలంగాణకు తాగునీరు. 60 టీఎంసీలు ఇండస్ట్రీకి. కాళేశ్వరంలో 141 టిఎంసిల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. 50 టీఎంసీలతో మల్లన్న సాగర్.. ఇక్కడినుండి మూసికి నీళ్లు తీసుకెళ్తానని రేవంత్ రెడ్డి అన్నాడు..
7000 కోట్లతో టెండర్లు కూడా పిలిచారు. మల్లన్న సాగర్ కూలిపోతే కాళేశ్వరం నీళ్లను మూసికి ఎలా తీసుకెళ్తావు రేవంత్ రెడ్డి అని ఆయన ప్రశ్నించారు.
గంధమల్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశావు.. అక్కడికి సోర్స్ కాళేశ్వరం మల్లన్న సాగరే కదా..ఉత్తంకుమార్ రెడ్డి కాళేశ్వరం లేకున్నా రికార్డ్ పంట పండింది అని అంటున్నారు. నేను ఉత్తంకుమార్ రెడ్డి ని అడిగాను. మీ ప్రభుత్వం వచ్చాక ఒక చెరువు దగ్గర ఒక చెక్ డ్యాం కట్టారా? ఒక ప్రాజెక్టు కట్టారా?ఒక ఎకరానికి అయినా నీల్లు ఇచ్చారా అని అడిగాను.. మరి ఎలా పంట సాధ్యమైంది.. పది సంవత్సరాల్లో టిఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన కృషి వల్ల ఇంత పంట పండింది.. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఇంపాక్ట్ ఉంది.. కేవలం మూడు బ్యారేజీల్లో ఒక్క బ్యారేజీలో మాత్రమే మూడు పిల్లర్లు కుంగాయి..అసెంబ్లీలో ఎమ్మెల్సీ కోదండరాంఅన్నారం సుందిళ్ల ప్రాజెక్టు గురించి ప్రశ్న అడిగితే అన్నారం సుందిళ్లలో ప్రాజెక్టులు బాగున్నాయి ఎలాంటి ఇబ్బంది లేదు అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి జవాబు ఇచ్చారు.
ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అంటారు... బ్లాక్ సెవెన్ ఒకటి రిప్లై చేసి కడితే సరిపోతుందని చెప్పింది..కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టి కాంగ్రెస్ హయాంలోనే కూలిన కడెం, ఎల్లంపల్లి, పెద్దవాగు ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటి అని హరీష్రావు ప్రశ్నించారు.మూడు నాలుగు వందల కోట్లలో మేడిగడ్డ రిపేర్ అయిపోతుంది. కానీ లక్ష కోట్లు అని దుష్ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ అన్నారు.రాష్ట్ర ప్రయోజనాలు రైతుల ప్రయోజనాలు దెబ్బ తినే విధంగా రాజకీయాలు చేయకూడదని హితవు పలికారు.
ఇది కూడా చూడండి: Putin Modi Meeting: మోదీతో కారులో మాట్లాడి.. సీక్రెట్ లీక్ చేసిన పుతిన్
Harish Rao : వారికి పాజిటివ్ ఆటిట్యూడ్ లేదు..హరీష్ రావు సంచలన కామెంట్స్
మాజీ మంత్రి తన్నీరు హరీష్రావు లండన్ పర్యటనలో భాగంగా అక్కడి ఎన్ఆర్ఐలు నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పాలకులకు పాజిటివ్ ఆటిట్యూడ్ లేకపోవడం వల్లే రాష్ట్రం అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు.
Harish Rao
Harish Rao : వ్యక్తిగత పనుల నిమిత్తం లండన్ వెళ్లిన మాజీ మంత్రి తన్నీరు హరీష్రావు అక్కడ ఎన్ఆర్ఐలు నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పాలకులకు పాజిటివ్ ఆటిట్యూడ్ లేకపోవడం వల్లే రాష్ట్రం అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. ఈరోజు పాలకులే నెగిటివ్ మైండ్ సెట్ తో ఉంటే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ గురించి మాట్లాడుతూ ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ పార్టీ మొదట పుట్టిందే లండన్ లోనే అని.. యూకే ఎన్నారైల వల్లే ప్రపంచవ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ వ్యాప్తి చెందిందన్నారు.మన సంస్కృతి, సాంప్రదాయాలు, బతుకమ్మ లాంటి పండుగలను ప్రపంచానికి చాటి చెప్పింది కూడా ఇక్కడి నుండేనన్నారు.. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణలో మేము నిరసన కార్యక్రమాలు, ఉద్యమాన్ని చేస్తున్నప్పుడు ఆ ఉద్యమాన్ని ఈ గడ్డపై కూడా చేసింది మీరేనన్నారు. కేసీఆర్ కు మద్దతిచ్చి రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన మీ అందరికీ తెలంగాణ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అనేక అద్భుతాలు సాధించిందని, ఒకప్పుడు దేశంలో నానుడి ఉండేది. బెంగాల్ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అని ఉండేది.. కానీ కేసీఆర్ పాలనతో తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అని కాడికి తెచ్చామన్నారు.గత 10 ఏండ్లలో.. గూగుల్లో సెర్చ్ చేసినా మీకు తెలుస్తుంది పర్ క్యాపిటా ఇన్కమ్ లో తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ఉందన్నారు.పర్ క్యాపిటా పవర్ వాడకంలో ఇండియాలో తెలంగాణ టాప్. జీఎస్డీపీ గ్రోత్ లో తెలంగాణ రాష్ట్రానికి దరిదాపులో కూడా ఏ రాష్ట్రం లేదు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు నల్ల ద్వారా అందించింది కేసీఆర్. మ్యానిఫెస్టోలో పెట్టుకోకపోయినా ఇంటికి తాగునీరు అందించిన గొప్ప నాయకుడు కేసీఆర్. అసెంబ్లీలో వచ్చే ఎన్నికల నాటికి ప్రతి ఇంటికి నల్ల ద్వార నీళ్ళియకపోతే ఓట్లు అడగను అని చెప్పిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని గుర్తు చేశారు.మిషన్ భగీరథ కార్యక్రమంతో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించి చూపించారన్నారు.
తెలంగాణ రాకముందు హైదరాబాదులో ఇండస్ట్రీస్ కి పవర్ హాలిడేస్ ఇచ్చేవారు. 4 గంటలకు మించి కరెంటు కట్ ఉండేది. గ్రామీణ ప్రాంతంలో 6 గంటల నుంచి 8 గంటల పవర్ కట్ ఉండేది. అరవై ఏళ్లలో కానీ పనిని కేసీఆర్ ఒక్క సంవత్సరంలో సాధించి 24 గంటల నాణ్యమైన కరెంటును ఇచ్చారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉదయం లేవగానే పవర్ పై సమీక్ష చేసి పవర్ కొనుగోలు టైమ్స్ ని చూసేవారు. తర్వాత మిషన్ భగీరథ ప్రోగ్రెస్ చూసేవాడు. డెడికేషన్ గా పనిచేసేవారు. ఫోకస్డ్ గా పనిచేయడం వల్ల తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని హరీష్రావు తెలిపారు.
మిషన్ భగీరథను ఆదర్శంగా తీసుకొని సర్దార్ కోచలాని కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు.పదేండ్లయినా కూడా భారతదేశంలో హర్ ఘర్ జల్ పూర్తి కాలేదు కానీ మూడు ఏండ్లలో మిషన్ భగీరథను పూర్తి చేసుకున్నామన్నారు. మిషన్ కాకతీయ మనందరం ఎక్కడో ఏదో గ్రామం నుంచి వచ్చిన వారమే.. మన ఊర్లలో ఉండే చెరువువులు ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైంది..చెరువుల్లో నీళ్లు బాగుంటే గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది వ్యవసాయానికి సాగునీరు, తాగునీరు అందుతాయి.. దాదాపు 30 వేల చెరువులను మూడు సంవత్సరాల్లో రిజిస్టర్ చేసాం.. ఈ కార్యక్రమం మొత్తం దేశం దృష్టినే ఆకర్షించిందన్నారు.కేంద్రం అమృత సరోవర్ కార్యక్రమాన్ని చేపట్టి అధ్యయనం చేయడానికి రాష్ట్రానికి అధికారులను పంపించిందన్నారు.
రైతుల కోసం దేశంలోనే నేరుగా నగదు బదిలీ చేసిన ఒకే ఒక కార్యక్రమం రైతుబంధు.. వాచ్మెన్ జాబ్ చేసినా పిల్లని ఇస్తారు కానీ రైతు అంటే పిల్లని ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. వ్యవసాయం అంటే చిన్నచూపు అయింది.అలాంటి పరిస్థితుల నుండి కేసీఆర్ రైతుబంధు అని ఒక కార్యక్రమం చేపట్టి.. ప్రతి సంవత్సరం 10000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవారు. 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు వ్యవసాయానికి అందించారు.. సాగునీరుని అందించడం ద్వారా వ్యవసాయం లాభసాటిగా మారిందన్నారు 2014కి ముందు ఎక్కడ చూసినా రెండు మూడు లక్షలకు మించి ఎకరం ఉండేది కాదు..ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ కూడా 30 నుండి 50 లక్షల ఎకరం తక్కువ లేదని హరీష్రావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి పీఎం కిసాన్ అని చేపట్టిందన్నారు. విద్యుత్ వినియోగమైనారోడ్ ట్రాన్స్ఫోర్ట్ అయినా, ఏ కార్యక్రమమైనా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.
భారత దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 7.7% గ్రీన్ కవర్ ని పెంచి ఇండియాలో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. గ్రీన్ కవర్ పెంచడం ద్వారా ఓట్లు రావు. జనరల్గా రాజకీయ నాయకులు పచ్చదనంపై దృష్టి సాధించరు. కానీ భవిష్యత్ తరాల కోసం పచ్చదనాన్ని అందించిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని స్పష్టం చేశారు.అదేవిధంగా ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దారని హరీష్రావు గుర్తు చేశారు.
ఎలక్షన్ల ముందు ఒక ఆయన కేసీఆర్ 24 గంటలు కరెంటు ఇచ్చిండు నేను 48 గంటలు కరెంటు ఇస్తా అని చెప్పిండు.. ఎన్నికల ముందు ఏది పడితే అది మాట్లాడారు. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలు ఇస్తున్నారు కదా మేము తులం బంగారంతో పాటు లక్ష రూపాయలు ఇస్తామన్నారు.. ఆంధ్రాలో ఒక ఎకరా అమ్మితే తెలంగాణలో పదెకరాలు వచ్చేది అని అనేవారుఒకప్పుడు.. ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఆంధ్రలో పది ఎకరాలు కొనవచ్చు..ఇప్పుడు 10 లక్షలు తక్కువకు అమ్ముదామంటే ఎవరూ కొనేవాళ్లు లేకుండా పోయిందని హరీష్ రావు అన్నారు. దీనికి కారణం ఒక పాజిటివ్ ఆటిట్యూడ్ లేకపోవడమే అన్నారు.
కేసీఆర్ తెలంగాణ ఓ గొప్ప రాష్ట్రంగా అభివృద్ధి జరుగుతున్నది అని చెప్పేవారు. ఈరోజు పాలకులే నెగిటివ్ మైండ్ సెట్ తో ఉంటే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.ఈ సందర్భాల్లో మనం కూడా చిన్న చిన్న తప్పులు చేసినా వాటిని కూడా మేము సరి చేసుకుని అందుకు వెళ్తున్నాం. హెల్త్ లో కూడా మదర్ అండ్ చైల్డ్ మరణాల రేట్ తగ్గిస్తూ దేశంలో మూడో స్థానంలో వచ్చాము. టీఆర్ఎస్ ఉండి ఉంటే ఈపాటికి నెంబర్ వన్ అయ్యేవారు. ఇప్పుడున్న ప్రభుత్వం పర్ఫామెన్స్పై దృష్టి సాధించకుండా గూగుల్ ప్రచారంపై దృష్టి సారించడం దురదృష్టం అన్నారు.తెలంగాణలో ఈరోజు అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. ఏ శాఖలో చూసిన అవినీతి పెరిగిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు.
కాళేశ్వరం అంటే లక్ష లక్ష కోట్ల రూపాయలు పోయాయని దుష్ప్రచారం.. కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు బారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్ లు, 21 పంపు హౌస్ లు, 203 కిలోమీటర్ల టన్నెలు, 1500 కిలోమీటర్స్ గ్రావిటీ కెనాల్, 98 కిలోమీటర్స్ గ్రావిటీ కెనాల్ 600 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేయడం.. గత సంవత్సరం ఈ సంవత్సరం మంచి వర్షపాతం ఉండె. ఎస్సారెస్పీ నుండి మిడ్ మానేరుకు నీళ్లు వస్తాయి.. కాళేశ్వరం మోటర్లను మిడ్ మానేరు నుండి ఆపరేట్ చేస్తాం. 37 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు వస్తాయి. యావరేజ్ రైన్ ఫాల్ ఉన్న ఇయర్లో ఎల్లంపల్లి నుండి కాళేశ్వరం మోటర్లు ఆన్ చేసుకుంటే అక్కడినుంచి నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. బ్యాడ్ ఇయర్.. ఎక్కడ వర్షపాతం లేకున్నా మేడిగడ్డ వద్ద నీళ్లు ఉంటాయి.. ఎంత క్రైసిస్ వచ్చినా అక్కడ నీళ్లు ఉంటాయి.. 37 లక్షల ఎకరాలకు సాగునీరు 60% తెలంగాణకు తాగునీరు. 60 టీఎంసీలు ఇండస్ట్రీకి. కాళేశ్వరంలో 141 టిఎంసిల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. 50 టీఎంసీలతో మల్లన్న సాగర్.. ఇక్కడినుండి మూసికి నీళ్లు తీసుకెళ్తానని రేవంత్ రెడ్డి అన్నాడు..
7000 కోట్లతో టెండర్లు కూడా పిలిచారు. మల్లన్న సాగర్ కూలిపోతే కాళేశ్వరం నీళ్లను మూసికి ఎలా తీసుకెళ్తావు రేవంత్ రెడ్డి అని ఆయన ప్రశ్నించారు.
గంధమల్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశావు.. అక్కడికి సోర్స్ కాళేశ్వరం మల్లన్న సాగరే కదా..ఉత్తంకుమార్ రెడ్డి కాళేశ్వరం లేకున్నా రికార్డ్ పంట పండింది అని అంటున్నారు. నేను ఉత్తంకుమార్ రెడ్డి ని అడిగాను. మీ ప్రభుత్వం వచ్చాక ఒక చెరువు దగ్గర ఒక చెక్ డ్యాం కట్టారా? ఒక ప్రాజెక్టు కట్టారా?ఒక ఎకరానికి అయినా నీల్లు ఇచ్చారా అని అడిగాను.. మరి ఎలా పంట సాధ్యమైంది.. పది సంవత్సరాల్లో టిఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన కృషి వల్ల ఇంత పంట పండింది.. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఇంపాక్ట్ ఉంది.. కేవలం మూడు బ్యారేజీల్లో ఒక్క బ్యారేజీలో మాత్రమే మూడు పిల్లర్లు కుంగాయి..అసెంబ్లీలో ఎమ్మెల్సీ కోదండరాంఅన్నారం సుందిళ్ల ప్రాజెక్టు గురించి ప్రశ్న అడిగితే అన్నారం సుందిళ్లలో ప్రాజెక్టులు బాగున్నాయి ఎలాంటి ఇబ్బంది లేదు అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి జవాబు ఇచ్చారు.
ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అంటారు... బ్లాక్ సెవెన్ ఒకటి రిప్లై చేసి కడితే సరిపోతుందని చెప్పింది..కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టి కాంగ్రెస్ హయాంలోనే కూలిన కడెం, ఎల్లంపల్లి, పెద్దవాగు ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటి అని హరీష్రావు ప్రశ్నించారు.మూడు నాలుగు వందల కోట్లలో మేడిగడ్డ రిపేర్ అయిపోతుంది. కానీ లక్ష కోట్లు అని దుష్ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ అన్నారు.రాష్ట్ర ప్రయోజనాలు రైతుల ప్రయోజనాలు దెబ్బ తినే విధంగా రాజకీయాలు చేయకూడదని హితవు పలికారు.
ఇది కూడా చూడండి: Putin Modi Meeting: మోదీతో కారులో మాట్లాడి.. సీక్రెట్ లీక్ చేసిన పుతిన్