/rtv/media/media_files/2025/06/28/suicide-attack-kills-16-soldiers-in-pakistan-2025-06-28-16-25-23.jpg)
Suicide attack kills 16 soldiers in Pakistan
పాకిస్థాన్కు మరో బిగ్ షాక్ తగిలింది. తాలిబన్ హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్ ఆత్మహుతి దాడికి పాల్పడింది. ఈ దాడిలో 16 మంది పాక్ సైనికులు మృతి చెందారు. ఈ విషయాన్ని ఆ దేశ సైనికాధికారులు అధికారికంగా ప్రకటించారు. అలాగే ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులు, పౌరులతో సహా మొత్తం 24 మందికి గాయాలయ్యాయని తెలిపారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. ఉగ్రవాది పేలుడు పదార్థాలు ఉన్న వాహనంతో సైనిక కాన్వాయ్పై దూసుకెళ్లినట్లు పేర్కొన్నారు.
Also Read: నా కొడుకు వీర్యాన్ని అప్పగించండి.. కోర్టులో తల్లి వింత పిటిషన్
వాహనంలో భారీ పేలుడు జరగడంతో 13 మంది పాక్ సైనికులు అక్కడికక్కడే మృతి చెందారు. గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరో ముగ్గురు సైనికులు మ-ృతి చెందారు. ఈ పేలుడు ధాటికి రెండు ఇళ్ల పైకప్పులు కూలిపోయాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు పిల్లలు గాయాలపాలైనట్లు పేర్కొన్నారు. అయితే పాక్కు చెందిన తాలిబన్ హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్ ఈ పేలుడు ఘటనకు బాధ్యత వహించింది.
Also Read: ఇజ్రాయిల్ ప్రధాని ప్లాన్ ఇదే.. యుద్ధాలతో ప్రజల్ని మార్చుతున్న నెతన్యాహు
ఇదిలాఉండగా పాకిస్థాన్పై బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ కూడా దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. బలూచిస్థాన్ను ప్రత్యేక దేశం చేయాలని కోరుతూ అక్కడ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ఓ రైలును కూడా బీఎల్ఏ మిలిటెంట్లు హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 400 మందికి పైగా ప్రయాణికులను బందీలుగా తీసుకెళ్లారు. ఆ తర్వాత రంగంలోకి దిగిన పాక్ ఆర్మీ వాళ్లను విడిపించింది.