/rtv/media/media_files/2025/02/13/IrcRkM6SieFSh1yfku47.webp)
eggs price
Shortage of Eggs: అగ్రరాజ్యం అమెరికా(America) కోడిగుడ్ల కొరతను ఎదుర్కొంటుంది. దీంతో కోడిగుండ్ల ధర అందనంతగా పెరిగిపోతుంది. గతంతో పోలిస్తే గుడ్ల ధరలు ఏకంగా 15 శాతం వరకు పెరిగాయి. ప్రస్తుతం ఈ కొరత ఇలాగే కొనసాగితే ఏడాది చివరినాటికి మరో 20శాతం వరకు ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు వాణిజ్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమెరికా వ్యాప్తంగా కోడిగుడ్ల కొరత ఏర్పడడమే ధరల పెరుగుదలకు కారణమని వారంటున్నారు. ఇప్పటికే అనేక స్టోర్లలో ‘లిమిటెడ్ స్టాక్’ బోర్డులు కనిపిస్తుండగా.. కొన్ని చోట్ల ‘నో ఎగ్స్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో స్టోర్ల నిర్వహకులు గుడ్ల అమ్మకంపై పరిమితి విధిస్తున్నాయి. ఒక్కరికి రెండు, మూడు ట్రేలు మాత్రమే ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నాయి.
ఇది కూడా చదవండి: రంగంలోకి KCR.. ఫిబ్రవరి 19 నుంచి బీఆర్ఎస్ పార్టీ బిగ్ ప్లాన్..!
భారత్లో పెరిగినట్లే అమెరికాలోనూ బర్డ్ ఫ్లూ వ్యాప్తి విపరీతంగా పెరిగింది. దీంతో గత సంవత్సరం ఒక్క డిసెంబర్లోనే సుమారు 2.3కోట్ల కోళ్లను వధించినట్లు అమెరికా వ్యవసాయశాఖ తెలిపింది. అమెరికాలోని ఒహాయో, మిస్సౌరీలలో బర్డ్ ప్లూ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో కోళ్ల ఉత్పత్తితో పాటు గుడ్ల దిగుమతి గణనీయంగా తగ్గిపోయింది. గతేడాది జనవరిలో డజను కోడిగుడ్ల ధర 2.52డాలర్లుగా ఉండగా.. డిసెంబర్ నాటికి అది 4.15 డాలర్లకు పెరిగింది. తాజాగా 7.34 డాలర్లుకు చేరింది. రానున్న రోజుల్లో కోడిగుడ్ల ధరలు మరింత పెరిగే అవకాశాలున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: కేరళ నర్సింగ్ కాలేజీ ర్యాగింగ్ కేసులో ఐదుగురు విద్యార్థులు అరెస్ట్
ధరలు పెరుగుతుండంతో వినియోగదారులు ఎక్కువ మొత్తంలో గుడ్లు కొనుగోలు చేసి నిలువ ఉంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఏకకాలంలో పెద్ద ఎత్తున కొనుగోలు చేయలనుకునేవారికి మార్కెట్లు చెక్ పెడుతున్నాయి.గుడ్ల కొనుగోలుపై సూపర్ మార్కెట్లు పరిమితి విధిస్తున్నాయి. ట్రేడర్ జో వంటి స్టోర్లు రోజుకు ఒకరికి డజను మాత్రమే ఇస్తుండగా.. హోల్ ఫూడ్స్ వంటి సంస్థలు మూడు కార్టన్లు, క్రోగర్ స్టోర్ రెండు డజన్లు మాత్రమే ఇస్తున్నాయి. గుడ్ల కొరతతో రెస్టారెంట్లు గుడ్డుపై 50శాతం అదనపు డబ్బులు వసూలు చేస్తున్నాయి.
Also Read : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లికి బిగ్ షాక్.. పోలీసులు నోటీసులు
లక్ష గుడ్ల చోరీ
గుడ్ల కొరత ఏర్పడుతుండడంతో కోడి గుడ్లను కొనుగోలు చేసేందుకు అమెరికన్లు భారీగా ఎగబడుతున్నారు. దీంతో కోడి గుడ్ల ధరలు అక్కడ అమాంతం పెరుగుతున్నాయి. మరోవైపు.. బర్డ్ ఫ్లూ కారణంగా గుడ్ల ఉత్పత్తి బాగా తగ్గిపోయిందని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే గుడ్లు దొంగతనం జరగడం కలకలం రేపింది. ఏకంగా 1 లక్ష గుడ్లను దుండగులు ఎత్తుకెళ్లినట్లు తాజాగా పోలీసులకు ఫిర్యాదు అందడం చర్చనీయాంశంగా మారింది. అమెరికా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కోడి గుడ్ల కొరత నెలకొనగా.. ఇప్పుడు ఏకంగా లక్ష గుడ్లు దొంగతనానికి గురి కావడం సంచలనంగా మారింది.
Also Read: ఇదేం ఉద్యోగం తల్లి.. ‘వర్క్ ఫ్రమ్ కార్’.. పోలీసుల పనికి అంతా షాక్!
పెన్సిల్వేనియా రాష్ట్రంలోని గ్రీన్క్యాసెల్ నగరంలో ఉన్న పీట్ అండ్ గ్యారీస్ ఆర్గానిక్స్ ఎల్ఎల్సీ సంస్థకు చెందిన లక్ష గుడ్లు మాయం అయ్యాయి. రిటైల్ షాపులకు సరఫరా చేసేందుకు గుడ్లను లారీల్లో లోడ్ చేయగా.. ఆ లోడ్ నుంచి దొంగలు కోడి గుడ్లను ఎత్తుకెళ్లినట్లు సదరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. చోరీ అయిన గుడ్ల విలువ 40 వేల డాలర్లు అని.. అయితే ఇది మన భారత కరెన్సీలో దాదాపు రూ.35 లక్షలు ఉంటుందని తెలుస్తోంది.
Also Read: ఢిల్లీ సీఎం ఎంపిక అప్పుడే.. ఇద్దరికి డిప్యూటీ సీఎంలుగా ఛాన్స్..!
గత కొన్ని రోజులుగా కోడి గుడ్ల కొరతతో అమెరికావాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2 ఏళ్ల క్రితం డజన్ గుడ్లు ఒక డాలర్ అంటే మన కరెన్సీలో రూ.84 ఉండగా.. ఇప్పుడు అదే డజన్ గుడ్ల ధర ఏకంగా 7 డాలర్లు అంటే దాదాపు రూ.590 పలుకుతున్నట్లు చెబుతున్నారు. గుడ్ల కొరత కారణంగానే ఒక్కసారిగా వీటి ధర అమాంతం పెరిగిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక అమెరికాలో గుడ్ల ధరలు పెరగడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి బర్డ్ఫ్లూ కాగా.. మరొకటి పెరుగుతున్న గుడ్ల డిమాండ్. గత 2 ఏళ్లుగా అమెరికాలోని పలు ప్రాంతాల్లో క్రమంగా బర్డ్ఫ్లూ ప్రభావం పెరుగుతూ వస్తోంది. గత దశాబ్దకాలంలోనే ఇంతటి భారీ స్థాయిలో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో బర్డ్ఫ్లూ వ్యాపించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
Also Read: Kiccha Sudeep: హైదరాబాద్ మెట్రోలో హీరో కిచ్చా సుదీప్.. అక్కడ ఏం చేశారో చూడండి?