/rtv/media/media_files/2025/08/31/postal-services-2025-08-31-21-44-18.jpg)
Postal Services
అంతర్జాతీయ వాణిజ్య సరుకుల కొరియర్లపై అమెరికా కస్ట్మ్స్ అదనపు సుంకాలను విధించింది. ఇది భారత తపాల శాఖ ద్వారా వెళ్ళే కొరియర్లకు వర్తించనప్పటికీ...మార్పులు చేయడం కోసం ఇండియన్ తపాలా శాఖ ఆగస్టులో సర్వీసులను ఆపేసింది. ఇప్పుడు రెండు నెలల తర్వాత వీటిని తిరిగి పునరుద్ధరించింది. కొత్త నిబంధనల ప్రకారం అమెరికాకు తపాలా శాఖ ద్వారా పంపించే సరకులపై కన్సైన్మెంట్ విలువలో 50 శాతాన్ని కస్టమ్స్ సుంకంగా చెల్లించాలి. దీని వలన భారత్ నుంచి ఎగుమతి చేసేవారికి ఎటువంటి నష్టమూ వాటిల్లదని తపాలాశాఖ చెబుతోంది. ఎంఎస్ఎంఈలు, చిన్న వ్యాపారులు, చేతివృత్తులవారు, ఈ-కామర్స్ ఎగుమతిదారులకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని వివరించింది. దాంతో పాటూ మన పోస్టల్ సుంకాల్లో ఎటువంటి మార్పూ ఉండదని...దీని వలన కూడా లాభం పొందుతారని చెప్పింది.
మొత్తం 25 దేశాల తపాలా సర్వీసులు నిలిపివేత
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కఠినమైన వాణిజ్య నిర్ణయాలతో ఇండియా నుంచి అమెరికాకు పంపే పార్సిల్ సేవలు ఆగస్టు 27 నుంచి నిలిచిపోయాయి. ఈ నిర్ణయం ప్రధానంగా చిన్న వ్యాపారులు, కళాకారులు, సాధారణ ప్రజల మీద తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది విద్యార్థులు అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్తుంటారు. వారి ఫ్రెండ్స్, బంధువులు ఇక్కడి నుంచి వాళ్ల కోసం పార్సిల్ పంపిస్తుంటారు. ఇక నుంచి అలా పంపించలేరు. భారత ప్రభుత్వం ఈ విషయంలో తమ దేశ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటుందని ప్రకటించింది.
అమెరికాకు పోస్టల్ సర్వీసులు నిలిపివేసినది ఒక్క భారత్ మాత్రమే కాదు మొత్తం 25 దేశాలు అంటోంది ఐక్యరాజ్యసమితిలోని యూనివర్సల్ పోస్టల్ యూనియన్. అన్ని దేశాలపై ట్రప్ విధిస్తున్న సుంకాలే దీనికి కారణం అని చెబుతున్నారు. చిన్న ప్యాకేజీలపై పన్ను మినహాయింపులను ట్రంప్ యంత్రాంగం ఉపసంహరించుకున్న నేపథ్యంలో 25 దేశాలు తమ పోస్టల్ సర్వీసులను ఆపేశాయని తెలిపారు. ప్రపంచ దేశాలకు సంబంధించిన పోస్టల్ సేవల మధ్య సహకారం కోసం ఏర్పాటైన యూనివర్సల్ పోస్టల్ యూనియన్ స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తోంది. అయితే ఈ సర్వీసులను ఆపేసిన దేశాల పేర్లను మాత్రం ఐరాస చెప్పలేదు. కానీ ఇందులో భారత్ తో సహ ఫ్రాన్స్, జర్మనీ. స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, నార్వే వంటి దేశాలున్నాయని తెలుస్తోంది. అమెరికా రీసెంట్ గా పాస్ చేసిన రూల్ ప్రకారం 800 డాలర్ల విలువైన వస్తువులపై ఉన్న పన్నును మినహాయింపును ఉపసంహరించుకుంది. దీని కారణంగా ఇవన్నీ ఆ దేశం విధించే సుంకాలకు లోబడి ఉంటాయి. దీంతో వాటి ధర రెట్టింపు అవుతుంది. అయితే 100 డాలర్ల విలువైన గిఫ్ట్ ఐటమ్స్, లెటర్స్ వాటికి మాత్రం సుంకాల నుంచి మినహాయింపు ఉంటుంది.
Also Read: US-China: చైనాతో ముదురుతున్న వాణిజ్య యుద్ధం..కుకింగ్ ఆయిల్ పై ఆంక్షలు