/rtv/media/media_files/2025/06/22/pm-modi-speaks-with-iran-president-2025-06-22-15-50-17.jpg)
PM Modi speaks with Iran's president
ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అమెరికా కూడా యుద్ధంలోకి దిగింది. ఇరాన్లోని మూడు అణు కేంద్రాలపై దాడులు చేసింది. దీంతో ఇజ్రాయెల్, ఇరాన్తో పాటు అమెరికాలో కూడా హై అలెర్ట్ నెలకొంది. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీ ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులపై దేశాధినేతలు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ప్రయత్నాలు చేయాలని కోరారు.
Also Read: భార్యను ఇంప్రెస్ చేద్దామనుకుంటే.. ఇరుక్కుపోయాడు
ఇక అమెరికా దాడులతో ఇరాన్ ఇజ్రాయిల్పై ప్రతీకారదాడులు మొదలుపెట్టింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని ఆ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇజ్రాయెల్పై ఇరామ్ మిసైల్స్తో వరుస దాడులకు పాల్పడుతోంది. టెల్అవీవ్, జెరూసలేంపై క్షిపణులు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పటికే టెల్ అవీవ్, జెరూసలేం ఇతర నగరాల్లో ఎమర్జె్న్సీ సైరన్లు మోగించారు. దీంతో వీధుల్లో ఇజ్రాయెల్ పౌరులు పరుగులు తీశారు. ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, బ్యాంకులను కూడా మూసివేసి అత్యవసర పరిస్థితి విధించినట్లు ఆ దేశ ప్రధాని నెతన్యాహూ తెలిపారు.
Also Read: ఇరాన్పై అమెరికా దాడులు.. అత్యంత సురక్షిత బంకర్లోకి ఖమేనీ
మరోవైపు తమపై అమెరికా చేసిన దాడులకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా దాడులపై ప్రపంచదేశాలు స్పందించాలని ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కోరారు. ఐక్యరాజ్య సమితి అమెరికా చర్యలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ట్రంప్ ఆరంభించాడు.. మేం ఆట ముగిస్తామని అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు. అమెరికా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపించారు. ఇరాన్పై అమెరికా దాడిని హౌతీలు కూడా తీవ్రంగా ఖండించారు. అమెరికాకు బుద్ధి చెప్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఎర్ర సముద్రంపైకి వచ్చే అమెరికన్ నౌకలను పేల్చేస్తామని హౌతీలు పేర్కొన్నారు.
Also Read: పెళ్లికి ఒప్పుకోలేదని దారుణం.. ఇద్దరి అక్కాచెల్లెళ్లపై బావ కాల్పులు