Operation Sindoor: సిగ్గు లేదు.. ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన పాక్ ఆర్మీ అధికారులు (VIDEO)

పీఓకేలో జరిగిన ఆపరేషన్ సిందూర్‌లో మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్తాన్ ఆర్మీ అధికారులు హాజరైయ్యారు. బిలాల్ టెర్రర్ ట్రైనింగ్ క్యాంప్ అధిపతి యాకుబ్ మొఘల్ చనిపోయిన విషయం తెలిసిందే. అతని అంతిమ సంస్కారాల్లో ISI, ఆర్మీ అధికారులు హాజరైయ్యారు.

New Update
army officials attended Funeral

పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని మరో సారి రుజువైంది. ఇండియా చేసిన ఆపరేషన్ సిందూర్‌లో జైష్- ఎ మహ్మద్ ఉగ్రవాది యాకూబ్ మొఘల్ మరణించాడు. అతని అంత్యక్రియలకు పాకిస్తాన్ ఆర్మీ అధికారులు హాజరయ్యారు. పాక్ ఆర్మీ, ISI ఈ ఉగ్రవాదులను చాలా సంవత్సరాలుగా వెనుకేసుకొస్తోందని ఇప్పడు ప్రపంచం ముందు కనిపిస్తోంది. ఉగ్రవాది అంత్యక్రియలకు పోలీసులు, అనుమానిత నిఘా అధికారులు సహా పాకిస్తాన్ భద్రతా సిబ్బంది హాజరైనట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. 

మే 7 తెల్లవారు జామున 1.44 నిమిషాలకు ఇండియన్ ఆర్మీ చేసిన ఆపరేషన్ సిందూర్‌లో బిలాల్ టెర్రర్ ట్రైనింగ్ క్యాంప్ అధిపతి యాకుబ్ మొఘల్ చనిపోయాడు. పీఓకేలో 23 నిమిషాలపాటు ఆపరేషన్ సిందూర్‌ నిర్వహించింది. బిలాల్ ఉగ్రవాద స్థావరం సీమాంతర ఉగ్రవాదానికి ప్రసిద్ధి. యాకుబ్ మొఘల్ అందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరణాన్ని ధృవీకరిస్తూ పాకిస్తాన్ ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. 

(operation Sindoor | operation sindoor air strike | pok | Indian Army | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు