/rtv/media/media_files/2025/05/01/PdmzbETs2Fq60RKN4y5F.jpg)
పాకిస్తాన్ బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ గురువారం పాకిస్తాన్ FM రేడియో స్టేషన్లలో భారతీయ పాటలపై నిషేధం విధించింది. ఏప్రిల్ 22 భారతదేశాన్ని కుదిపేసిన పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. గత వారం జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిలో పర్యాటకులు లక్ష్యంగా చేసుకుని 26 మంది మరణించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నందుకు పాకిస్తాన్పై భారతదేశం గట్టి చర్యలు తీసుకుంది.
Also read: భారత్ని దెబ్బతీసేందుకు పాకిస్తాన్ కొత్త ప్లాన్.. మయన్మార్, బంగ్లాదేశ్లో కుట్ర..!
#BREAKING: Pakistan Broadcasters Association (PBA) has banned airing of Indian songs on Pakistan FM Radio Stations. The move is likely to witness a massive drop in audience of Pakistani radio stations. Self-Goal by Pakistani Government. pic.twitter.com/gGQ6gw9pdS
— Aditya Raj Kaul (@AdityaRajKaul) May 1, 2025
Also read: BIG BREAKING: లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర పాకిస్తాన్ ఆర్మీ కవాతు.. పాక్లో పరిస్థితి ఇదే..!
పాకిస్తాన్ బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ (PBA) దేశవ్యాప్తంగా ఉన్న పాకిస్తానీ FM రేడియో స్టేషన్లలో భారతీయ పాటల ప్రసారాన్ని తక్షణమే నిలిపివేసిందని PBA సెక్రటరీ జనరల్ షకీల్ మసూద్ తెలిపారు. ముఖ్యంగా లతా మంగేష్కర్, మహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్, ముఖేష్ వంటి ఫేమస్ ఇండియన్ సింగర్స్ పాటలు పాకిస్తానీలలో ప్రసిద్ధి చెందాయి. పాకిస్తాన్లోని FM రేడియో స్టేషన్లు ప్రతిరోజూ వాటిని ప్రసారం చేస్తాయి. రెండు దేశాల మధ్య ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అన్ని FM రేడియో స్టేషన్లలో భారతీయ పాటల ప్రసారంను వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వం అసోసియేషన్ను ఆదేశించింది. ఈ నిర్ణయంతో పాకిస్తాన్ సమాచార మంత్రి అట్టా తరార్ PBAని ప్రశంసించారు. PBA దేశభక్తి చర్య ఎంతో గొప్పదని ఆయన అన్నారు.
(pakisthan | india pak war | latest-telugu-news | attack in Pahalgam)