సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు షేర్ చేస్తున్న పాక్‌..

ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కానీ పాకిస్థాన్‌ దొంగబుద్ధి ఏమాత్రం మారడం లేదు. భారత్‌లోని నగ్రోటా ఎయిర్‌బేస్‌ను పేల్చేశామంటూ ఫేక్ వీడియోను ప్రచారం చేస్తోంది.

New Update
Fake videos by Pakistan

Fake videos by Pakistan

ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కానీ పాకిస్థాన్‌ దొంగబుద్ధి ఏమాత్రం మారడం లేదు. భారత్‌లోని ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ను పేల్చేశామంటూ చాలా ఫేక్ వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. జమ్మూకశ్మీర్‌లోని JF-17s, F16sతో నగ్రోటా ఎయిర్‌బేస్‌ను పేల్చేశామంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. వాస్తవానికి అది 2024 అక్టోబర్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన వీడియో. 

Also Read: పాక్ పై మళ్లీ వాటర్ వార్.. సలాల్ డ్యామ్ 5 గేట్లు ఓపెన్

అంతేకాదు అత్యంత శక్తివంతమైన భారత్ గగనతల రక్షణ వ్యవస్థ ఎస్‌-400‌ను ధ్వంసం చేసినట్లు కూడా ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేస్తోంది. దీన్ని పాకిస్తాన్ జేఎఫ్‌-17 యుద్ధ విమాన క్షిపణితో కూల్చేసిందని చైనా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇది ఫేక్ న్యూస్ అని, ఎస్‌-400‌ను ధ్వంసం చేయలేదని భారత సైనికాధికారులు వెల్లడించారు.

Also Read: దాడులు ఆపితే ఉద్రిక్తతల తగ్గింపునకు సిద్ధం.. పాక్ కాళ్ల భేరం!

 telugu-news | fake-news | Social Media 

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Student Visas: వీసా స్లాట్లను రోజూ చెక్ చేసుకోండి..విద్యార్థులకు అమెరికా సూచన

వీసాల విషయంలో ఆందోళన పడుతున్న విద్యార్థులకు అమెరికా విదేశాంగ శాఖ కాస్త ఊరటను ఇచ్చే కబురు తెలిపింది. వీసా స్లాట్లు తొందరలోనే ఓపెన్ అవుతాయని...వాటి కోసం వబ్ సైట్ ను చెక్ చేసుకుంటూ ఉండాలని సూచించింది. 

New Update
usa

Students In USA

రీసెంట్ గా అమెరికాకు వచ్చే విద్యార్థుల వీసాలను ఇంటర్వ్యూలను నిలిపేసింది. దీంతో వేలాది మంది విద్యార్థులు భవిష్యత్తు ఆందోళన లో పడిపోయింది. తమ కలలు...కల్లలుగానే మిగిలిపోవాలని విద్యార్థులందరూ బాధలో కూరుకుపోయారు. అయితే మళ్ళీ అమెరికా వారికి తీపి కబురు చెప్పింది. వీసా ప్రక్రియ శాశ్వతంగా ఆగిపోలేదని..మళ్ళీ దానిని రెన్యూ చేస్తామని తెలిపింది. స్లాట్ల కోసం రోజూ చెక్ చేసుకోండి అని చెప్పింది. త్వరలోనే ఈ స్లాట్లు ఓపెన్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయని అమెరికా విదేశాంగశాఖ ప్రకటించింది. 

సాఫ్ట్ వేర్ అప్డేట్ కోసమే..

వెంటనే ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ మొదలవదు కానీ త్వరలోనే చేస్తామని హామీ ఇచ్చింది. ఎప్పుడు ఓపెన్ అవుతాయో కచ్చితంగా చెప్పలేమని...తరచుగా స్లాట్లను చెక్ చేసుకోవాలని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి టామీ బ్రూస్‌ వివరించారు.  జాతీయ భద్రత కోసమే ఇవన్నీ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. వీసా ప్రక్రియలో ఇందులో చాలా ముఖ్యమైనది అని అన్నారు. విద్యార్థుల సోషల్ మీడియా తనిఖీలు చేసేందుకే ఇంటర్వ్యూలను నిలిపివేశామని తెలిపారు. తనిఖీకి సంబంధించిన సాఫ్ట్ వేర్ లో మార్పులు చేసే వరకు వీసాల బుకింగ్ ను తాత్కాలికంగా నిలిపివేసామని చెప్పారు. 

 

Also Read: కౌంట్ డౌన్ స్టార్ట్.. మిస్ వరల్డ్ కిరీటానికి చివరి పోరు! రేపే ఫైనల్స్
 

 

Advertisment
Advertisment