సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు షేర్ చేస్తున్న పాక్‌..

ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కానీ పాకిస్థాన్‌ దొంగబుద్ధి ఏమాత్రం మారడం లేదు. భారత్‌లోని నగ్రోటా ఎయిర్‌బేస్‌ను పేల్చేశామంటూ ఫేక్ వీడియోను ప్రచారం చేస్తోంది.

New Update
Fake videos by Pakistan

Fake videos by Pakistan

ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కానీ పాకిస్థాన్‌ దొంగబుద్ధి ఏమాత్రం మారడం లేదు. భారత్‌లోని ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ను పేల్చేశామంటూ చాలా ఫేక్ వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. జమ్మూకశ్మీర్‌లోని JF-17s, F16sతో నగ్రోటా ఎయిర్‌బేస్‌ను పేల్చేశామంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. వాస్తవానికి అది 2024 అక్టోబర్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన వీడియో. 

Also Read: పాక్ పై మళ్లీ వాటర్ వార్.. సలాల్ డ్యామ్ 5 గేట్లు ఓపెన్

అంతేకాదు అత్యంత శక్తివంతమైన భారత్ గగనతల రక్షణ వ్యవస్థ ఎస్‌-400‌ను ధ్వంసం చేసినట్లు కూడా ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేస్తోంది. దీన్ని పాకిస్తాన్ జేఎఫ్‌-17 యుద్ధ విమాన క్షిపణితో కూల్చేసిందని చైనా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇది ఫేక్ న్యూస్ అని, ఎస్‌-400‌ను ధ్వంసం చేయలేదని భారత సైనికాధికారులు వెల్లడించారు.

Also Read: దాడులు ఆపితే ఉద్రిక్తతల తగ్గింపునకు సిద్ధం.. పాక్ కాళ్ల భేరం!

 telugu-news | fake-news | Social Media 

Advertisment
Advertisment
తాజా కథనాలు