/rtv/media/media_files/2025/05/04/c3OqNnZGz4j6fHquYl03.jpg)
Muslim Countries Not Supporting to Pakistan amid India-Pak Tensions
పాకిస్థాన్కు మరో బిగ్షాక్ తగిలింది. ముస్లిం దేశాలు పాక్ను ఏకాకి చేశాయి. ఆ దేశానికి మద్దతు ఇచ్చేందుకు ముస్లిం దేశాలు వెనకడుగు వేస్తున్నాయి. సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ ఇండియా వైపే ఉన్నాయి. భారత్తో ఆ దేశాలకు బలమైన వ్యాపార సంబంధాలు ఉండటమే దీనికి కారణం. అయితే ఏకపక్షంగా పాకిస్థాన్కు సపోర్ట్ ఇచ్చేందుకు సౌదీ నిరాకరించింది.
Also Read: నా తండ్రితో పడుకో.. లేదంటే! భార్య నగ్నవీడియోలు తీసి భర్త వేధింపులు!
India-Pak Tensions
మరోవైపు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజ ఆసీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ వాయుసేనతో ఘర్షణలు జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉందని అన్నారు. పాకిస్థాన్కు చెందిన ఏఆర్వై న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పటికే తమ గగనతలంలోకి రఫేల్ యుద్ధ విమానాలు రావడానికి యత్నించాయని.. వాటిని తాము అడ్డుకున్నట్లు పేర్కొన్నారు.
Also Read: ఇజ్రాయెల్కు బిగ్షాక్.. ఎయిర్పోర్ట్పై హౌతీలు మిస్సైల్ దాడి
ఇదిలాఉండగా గత నెల చివర్లో ఖవాజ ఆఫీస్ చేసిన ప్రకటన సంచలనం రేపింది. భారత్ 24 నుంచి 36 గంటల్లోనే తమపై సైనిక చర్య చేపడుతుందని అన్నారు. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. భారత్లో సీసీఎస్ మీటింగ్ ముగిసిన తర్వాత ఉగ్రవాదులపై చర్యకు మోదీ సర్కార్.. మిలటరీకి అధికారులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా భారత్ వాయుసేనతో ఘర్షణలు జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉందని తాజాగా ఆసీఫ్ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: 'రామ్ ద్రోహి'.. రాహుల్ గాంధీపై బీజేపీ నేత సంచలన కామెంట్స్!
Also Read: ప్రధాని మోదీతో సీఎం ఒమర్ అబ్దుల్లా భేటీ...30 నిమిషాలపాటు దానిపైనే చర్చ...
rtv-news | india pakistan india pakistan war