/rtv/media/media_files/2025/01/19/NJuShpWFBdqtTxjdBKQB.jpg)
Moroccan govt plans to kill 30 lakh dogs
Dogs Killing: మొరాకో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఫిఫా వరల్డ్ కప్ 2030 తమ గడ్డపై జరగనున్న నేపథ్యంలో వీధి కుక్కలు లేకుండా చేసేందుకు సిద్ధమైంది. దాదాపు 30 లక్షలకుపైగా కుక్కలను హతమార్చనుంది. జంతు హక్కుల సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Introducing the hosts for the next two editions of the @FIFAWorldCup! 🏆
— FIFA (@FIFAcom) December 11, 2024
Morocco, Portugal and Spain will host in 2030, with centenary celebration matches in Argentina, Paraguay and Uruguay.
Four years later, Saudi Arabia will host the FIFA World Cup 2034™. pic.twitter.com/WdOEdNEVxH
ఫిఫా 2030 టోర్నమెంట్ కోసమే..
ఈ మేరకు ఫిఫా 2030 టోర్నమెంట్ లో భాగంగా పర్యాటకులను ఆకర్షించేందుకు విభిన్న ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే వీధికుక్కలను హతమార్చనుంది. కుక్కలకు చంపడానికి అత్యంత విషపూరితమైన స్ట్రైక్నైన్ను ప్రయోగించడంతోపాటు కాల్చిపారేయడం, కొన్నింటిని పారలతో కొట్టి చంపుతున్నట్లు సమాచారం.
గవర్నింగ్ బాడీకి బహిరంగ లేఖ
అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని జంతు సంరక్షణ సంస్థలు, ఉద్యమకారులు ఖండిస్తున్నారు. అమానవీయ పద్ధతులను అవలంబిస్తున్నారంటూ తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రఖ్యాత ప్రైమటాలజిస్ట్, జంతు హక్కుల న్యాయవాది జేన్ గూడాల్ వ్యతిరేకించారు. ఇందులో ఫిఫా జోక్యం చేసుకోవాలని కోరారు. మొరాకో ఆతిథ్య బాధ్యతలను నిలిపివేయాలని, ఈ ఘోరాన్ని ఆపేందుకు ఫిఫా వెంటనే చర్యలు తీసుకోవాలని గూడాల్ పుట్బాల్ గవర్నింగ్ బాడీకి బహిరంగ లేఖ రాశారు.
ఇది కూడా చదవండి: Thaman: డైరెక్టర్ తో గొడవ, ప్రభాస్ సినిమా నుంచి మధ్యలోనే వెళ్లిపోయిన తమన్
మొరాకోలో వీధి కుక్కలను చంపడాన్ని నిషేధించే చట్టపరమైన ఫ్రేమ్ వర్క్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇలా చేయడం అమానవీయమని మండిపడుతున్నారు. ఈ అమానవీయ చర్యను ప్రపంచం చూస్తోంది. వీధి కుక్కలను నియంత్రించడానికి మొరాకో అధికారులు మానవీయ విధానాలను అవలంబించడం దారుణమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇక కుక్కలను హతమార్చడంపై విమర్శలు రావడంతో ఫిఫా ప్రత్యామ్నాయ మార్గంపై ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కుక్కలను చంపడానికి బదులుగా తగిన పరిష్కారాలకోసం లోకల్ సంస్థలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఫిఫా పర్యవేక్షిస్తోందని కథనాలు వెలువడ్డాయి.