Israel: అణు ముప్పు సాకు మాత్రమే..అసలు టార్గెట్ ఇరాన్ ప్రభుత్వం కూల్చివేతే..

ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు మీద దాడులు చేస్తోంది. దీనికి కారణం అణు ముప్పే అని చెబుతోంది. కానీ అసలు టార్గెట్ మాత్రం ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చేయడమే అని విశ్లేషకులు చెబుతున్నారు. 

New Update
israel

Netanyahu-Khameni

అణు కార్యక్రమం సాకుతో ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడులను ముమ్మరం చేసింది. ఇరాన్ అణ్వాయుధాలను నాశనం చేస్తామని ప్రతిజ్ఞ చేసింది. అన్నట్టుగానే అణు కేంద్రాలపై దాడులు చేసింది. ఇందులో ఆ కేంద్రాలు దెబ్బ తిన్నాయని ఫోటోలు కూడా చూపెడుతోంది. ఈ దాడుల్లో ఇద్దరు అణు శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులు కూడా చనిపోయారు. అయితే ఇజ్రాయెల్ దాడుల వెనుక కేవలం అణు ముప్పు మాత్రమే కాదని తెలుస్తోంది. ఆ దేశం దానికన్నా పెద్ద స్కెచ్చే వేసిందని చెబుతున్నారు. 

ఇరాన్ ప్రభుత్వమే టార్గెట్..

అణు ముప్పు కేవలం సాకు మాత్రమేనని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అసలు ఉద్దేశం వేరని చెబుతున్నారు. ఇరాన్ లో ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చడమే ఆయన లక్ష్యమని అంటున్నారు. ఇరాన్ ప్రజలను నియంతృత్వం నుంచి విముక్తి పొందాలని నెతన్యాహు విజ్ఞప్తి చేశారు, దాని వెనుక కారణం ఇదేనని తెలుస్తోంది. ఇరాన్ ప్రజలు తమ జెండా, చారిత్రక వారసత్వం కోసం నిలబడి ఖమేనీ దుష్ట పాలనను అంతం చేయాల్సిన అవసరం సమయం ఆసన్నమైందని నెతన్యాహు అన్నారు. ఇరాన్ లో దాడులు జరిగాక ఆయన మాట్లాడుతూ...ఇది ప్రారంభం మాత్రమే ముందు ముందు ఇంకా చాలా ఎక్కువ ఉంటుందని అన్నారు. మరింత మంది నాయకులను మట్టుబెట్టడమే లక్ష్యమని చెప్పారు. 

అయితే మరోవైపు ఇరాన్ లో అధికారం మారితే దేశం అరాచకంలో కూరుకుపోతుందని చెబుతున్నారు. 9 కోట్ మంది జనాభా ప్రభావితం అవుతారని...దాని వలన మిడిల్ ఈస్ట్ అంతా అల్లకల్లోలం అయిపోతుందనే వాదన వినిపిస్తోంది. ఇక్కడ షా కుమారుడు రెజా పహ్లవి , ముజాహిదీన్-ఎ-ఖల్క్' అంటే MEK లు కాచుకుని కూర్చొన్నాయి. వీరందరూ పాత రాచరికాన్ని తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఖమేనీ ప్రభుత్వం కనుక కూలిపోతే వారందరూ రెచ్చిపోతారని అంటున్నారు. 

 

Also Read: USA: ఘనంగా అమెరికా ఆర్మీ డే..కానీ విత్ అవుట్ పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌

Advertisment
Advertisment
తాజా కథనాలు