/rtv/media/media_files/2025/05/08/1WoufSR6fi9IeTFhLX9y.jpg)
Pakistan Army Chief Asif Munir
అమెరికా ఆర్మీ డే ను న్యూ యార్క్ లో గొప్పగా జరిపారు. వాషింగ్టన్ నగర వీధుల్లో జరిగిన కవాతుల్లో వేలమంది పాల్గొన్నారు. దాంతో పాటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 79వ పుట్టినరోజు కూడా ఇదే రోజు కావడం విశేషం. అయితే ప్రస్తుతం అమెరికాలో ట్రంప్ కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇలాంటి టైమ్ లో పరేడ్ సరిగ్గా జరుగుతుందా అని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ అమెరికా ప్రభుత్వం మాత్రం దీన్ని ఘనంగానే జరిపింది. కానీ దీనికి ప్రజలు మాత్రం పెద్దగా ఎవరూ రాలేదు. పరేడ్ తో ప్రజాధనం వినియోగం చేశారని 60 శాతం మంది విమర్శించారు కూడా.
పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ ను పిలవలేదు..
అమెరికా ఆర్మీ డేకు పాక్ ఆరమీ ఛీఫ్ ఆసిఫ్ మునీర్ ను పిలిచారని వార్తలు వచ్చాయి. భారత్ కు సపోర్ట్ అని చెప్పిన అమెరికా ఇప్పుడు పాక్ కు ఎందుకు దగ్గరవుతోంది అంటూ బోలెడు అనుమానాలు కూడా తలెత్తాయి. చైనాకు చెక్ పెట్టేందుకే అంటూ విశ్లేషణలు కూడా వినిపించాయి. ఇవన్నీ అలా ఉంటే అమెరికా అసలు ఆసిమ్ మునీర్ ను ఆర్మీ డేకు పిలవనే లేదని తెలుస్తోంది. ఆయనను ఆహ్వానించినట్టు వచ్చిన వార్తలను వైట్హౌస్ అధికార వర్గాలు ఖండించాయి. మునీర్ సహా ఏ విదేశీ నేతనూ పరేడ్ కోసం ఆహ్వానించలేదని వివరణ ఇచ్చాయి. భారత్ కు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని తేల్చి చెప్పింది.
Also Read: Iran-Israel: ఇరాన్ అణు కేంద్రాలు ధ్వంసం..ఫొటోలు బయటపెట్టిన ఇజ్రాయెల్