/rtv/media/media_files/2025/01/17/Q46tkMkaL07TiGb4N4ia.jpg)
Israel cabinet
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణకు, బందీలను విడుదల చేసేందుకు ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలపాలని సిఫార్సు చేసినట్లు ప్రధాని నెతన్యాహు కార్యాలయం తెలిపింది. అయితే ఆదివారం నుంచి ఈ ఒప్పందం అమలయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. '' అన్ని రాజకీయ, భద్రతాపరమైన, మానవతా అంశాలను సమీక్షించి, యుద్ధం లక్ష్యాలను సాధించేందుకు ఇది ప్రయోజనకరం. ఈ ప్రతిపాదిత ఒప్పందానికి ఆమోదించేందుకు సెక్యూరిటీ కేబినెట్ ప్రభుత్వానికి సిఫార్సు చేసిందని'' ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.
Also Read: ఏపీకి గుడ్న్యూస్.. వైజాగ్ స్టీల్ప్లాంట్కు కేంద్రం రూ.11,440 ప్యాకెజీ
అలాగే ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపేందుకు పూర్తిస్థాయి కేబినెట్ కూడా వెంటనే సమావేశమవుతుందని పేర్కొంది. అయితే అమెరికా, ఖతార్ మధ్యవర్తిత్వం వల్ల ఇజ్రాయెల్-హమాస్ మధ్య ప్రస్తుతం కాల్పుల విరమిణ ఒప్పందం సాగుతోంది. ఈ క్రమంలోనే హమాస్ బందీల విడుదలకు చేస్తామని చెప్పగా.. దీనికి ప్రతీగా ఇజ్రాయెల్ పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టనుంది.
Also Read: బీజీపీ మేనిఫెస్టోపై స్పందించిన కేజ్రీవాల్.. మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్
ఆ తర్వాత పూర్తిస్థాయిలో యుద్ధాన్ని ముగించేలా చర్యలు తీసుకోనున్నారు. అయితే ఈ ఒప్పందానికి సంబంధించి బంధీల కుటుంబాలకు ఇప్పటికే సమాచాం ఇచ్చామని ప్రధాని కార్యాలయం చెప్పింది. ఇదిలాఉండగా.. 2023న అక్టోబర్ 7న ఇజ్రాయెల్ హమాస్ మెరుపుదాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 1200 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందారు. అలాగే హమాస్ మిలిటెంట్లు 250 మంది ఇజ్రాయెల్ పౌరుల్ని బందీలుగా చేసుకున్నారు. అప్పటినుంచి ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేస్తూనే ఉంది. తాజాగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరుగుతుండటంతో అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: బాబా సజీవ సమాధి తవ్వకుండా అడ్డుకున్న ఫ్యామిలీ.. పోలీసుల విచారణలో బిగ్ ట్విస్ట్