/rtv/media/media_files/2025/01/17/CyhOEmH6YLo7L743Rd3H.jpg)
Vizag Steel Plant
ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న విశాఖ ఉక్కు కర్మగారాన్ని గట్టెంకించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా రూ.11,440 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. దీనికి సంబంధించి కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం ప్రకటన చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో గురువారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు.
'' విశాఖ ఉక్కు కర్మాగారం స్టీల్ రంగంలో ఒక ప్రధానమైన సంస్థ. ఈ పరిశ్రమలో ఏళ్లతరబడి సమస్యలు కొనసాగుతున్నాయి. విశాఖ ఉక్కుకి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ వెంటనే అమల్లోకి వస్తుంది. మరికొన్ని రోజుల్లో రెండు బ్లాస్ట్ ఫర్నేస్లు ప్రారంభమవుతాయి. ఆగస్టు నాటికి మూడు బ్లాస్ట్ ఫర్నేస్లు వస్తాయి. ప్రస్తుతం ముడి సరకు సరఫరా చేసేందుకు ఎన్ఎండీసీతో చర్చలు జరుపుతున్నాం. విశాఖ ఉక్కు ఆత్మనిర్భర్ భారత్లో ముఖ్యపాత్ర పోషిస్తుంది. దేశంలో ఉక్కు అవసరాలు తీర్చేందుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్కు కీలక పాత్ర ఉందని'' అశ్విని వైష్ణవ్ అన్నారు.
సీఎం చంద్రబాబు అధికారం చేపట్టినప్పటి నుంచి స్టీల్ ప్లాంట్పై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. ఢిల్లీకి వచ్చిన ప్రతీసారి ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉక్కుశాఖ మంత్రితో చర్చలు జరుపుతున్నారని పేర్కొన్నారు. ఈ అంశంపై విభిన్న కోణాల్లో చర్చించిన తర్వాతే కేంద్ర ఆర్థిక వ్యవహారల కేబినెట్.. విశాఖ ఉక్కు కోసం ప్యాకేజీకి ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు.
Also Read: ఇక ఫేక్ కాల్స్కు గుడ్బై.. ఈ కొత్త ఫీచర్తో ట్రూకాలర్ అవసరం లేదు
విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్రతీ సంవత్సరం 7.3 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసే సామర్థ్యముంది. అయితే 2023-24లో రూ.4,8488.86 కోట్లు, 2022-23లో రూ.2,858.74 కోట్లు నష్టం వచ్చింది. వర్కింగ్ క్యాపిటల్ కోసం అప్పులు పెరగడం వల్లే ఈ పరిస్థి్తి వచ్చింది. ఎన్డీయే కూటమి మళ్లీ అధికారంలోకి వచ్చాక కేంద్క ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి స్టీల్ ప్లాంట్ను సందర్శించారు. అయితే ప్లాంట్ నిలదొక్కుకునేందుకు రూ.18 వేల కోట్లు అవసరమని విశాఖ ఎంపీ శ్రీభరత్, కార్మిక సంఘాల నేతలు ఆయనకు చెప్పారు. ఆ తర్వాత కొన్ని రోజులకి కేంద్ర ఉక్కుశాఖ ఎమర్జెన్సీ నిధుల కింద జీఎస్టీ చెల్లింపు కోసం రూ.500 కోట్లు, బ్యాంకు అప్పుల చెల్లింపునకు రూ.1150 కోట్లు చొప్పున రెండు విడుతల్లో సాయం చేసింది.
వర్కింగ్ క్యాపిటల్ కోసం అప్పులు పెరగడం, ముడిసరకు తగినంత లేకపోవడం, కోర్టు ఎటాచ్మెంట్లు తదితర వాటివల్ల ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ కష్టాల్లో ఉంది. వీటి సమస్యలు పరిష్కరించేందుకు ప్రణాళిక తయారుచేస్తున్నామని కేంద్రం ఇటీవలే పార్లమెంటు స్థాయిసంఘానికి తెలియజేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా విశాఖ ఉక్కు కర్మాగారానికి రూ.11,440 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది.
Also Read: పాకిస్థాన్ మాజీ ప్రధానికి బిగ్ షాక్.. 14 ఏళ్లు జైలు శిక్ష
వర్కింగ్ క్యాపిటల్ కోసం చేసిన అప్పుల భారం, తగినంత ముడిసరకు లేకపోవడం, కోర్టు ఎటాచ్మెంట్లు, ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్తో విశాఖ ఉక్కు కర్మాగారం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. వీటిని తీర్చడంతోపాటు భవిష్యత్తులో తలెత్తే కష్టాల నుంచి తప్పించడానికి ఒక సమగ్ర ప్రణాళికను తయారు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇదివరకే పార్లమెంటు స్థాయీసంఘానికి చెప్పింది. దానిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆ సంఘం పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో సిఫార్సు చేసింది. దాని ప్రకారమే కేంద్ర ప్రభుత్వం ఈ ప్యాకేజీకి ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. విశాఖ ఉక్కు కర్మాగారానికి కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించడంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. నష్టాలను ఆపేందుకు, ప్లాంట్ తిరిగి లాభాల బాట పట్టేందుకు ఈ ప్యాకేజీ ఎంతగానో దోహదం చేస్తుందన్నారు.