Israel-Iran War: కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నాం.. ఇజ్రాయెల్ సంచలన ప్రకటన

గత 12 రోజులుగా కొనసాగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ముగిసింది. అమెరికా ప్రతిపాదనతో ఇరు దేశాలు కూడా కాల్పుల విరమణకు అంగీకరించాయి. ముందుగా ఇరాన్ కాల్పుల విరమణను ప్రారంభించగా.. తాజాగా ఇజ్రాయెల్ కూడా సీజ్‌ఫైర్‌కు అంగీకరించింది.

New Update
Israel PM Netanyahu

Israel PM Netanyahu

గత 12 రోజులుగా కొనసాగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ముగిసింది. అమెరికా ప్రతిపాదనతో ఇరు దేశాలు కూడా కాల్పుల విరమణకు అంగీకరించాయి. ముందుగా ఇరాన్ కాల్పుల విరమణను ప్రారంభించగా.. ఇజ్రాయెల్ కూడా సీజ్‌ఫైర్‌కు అంగీకరించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కార్యాలయం ప్రకటన చేసింది. '' ఆపరేషన్ రైజింగ్ లయన్ లక్ష్యాలను ఇజ్రాయెల్ సాధించింది. ఇరాన్ నుంచి పొంచి ఉన్న రెండు ప్రధాన ముప్పులను తొలగించాం. 

Also Read: అమెరికాకు ఇక చుక్కలే.. దోమ సైజులో చైనా డ్రోన్.. వీడియో చూస్తే షాక్ అవుతారు!

ఇరాన్ గగనతలాన్ని ఐడీఎఫ్‌ పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇరాన్ ప్రభుత్వానికి చెందిన డజన్ల కొద్ది ప్రాంతాలను ధ్వంసం చేసింది. ఇరాన్ గుండెను ముక్కలు చేసింది. ఇజ్రాయెల్‌కు రక్షణపరంగా సహకారం అందించడమే కాక యుద్ధంలోకి స్వయంగా అడుగుపెట్టి ఇరాన్ నుంచి ఉన్న అణుమప్పును తొలగించడంలో సాయం చేసిన ట్రంప్‌కు కృతజ్ఞతలు చెబుతున్నాం. లక్ష్యాలు నెరవేర్చడంతో పాటు ట్రంప్‌ ప్రతిపాదనతో ద్వైపాక్షిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని మేము పూర్తిగా అంగీకరిస్తున్నామని'' ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ప్రతిచర్యలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది.    

Also Read: యుద్ధంలో ఇరాన్ ఈ 5 గుణపాఠాలు చేర్చుకోవాలి.. ఎంత నష్టమో తెలుసా..!

ఇజ్రాయెల్ ఇరాన్‌ కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్‌ పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ముందుగా ఇరాన్ కాల్పుల విరమణ పాటిస్తుందని.. ఆ తర్వాత ఇజ్రాయెల్ కూడా ప్రారంభిస్తుందని చెప్పారు. దీనివల్ల యుద్ధం ముగుస్తుందని చెప్పారు. అయితే ట్రంప్ ఈ ప్రకటన చేసిన తర్వాత కూడా ఇరుదేశాల మధ్య దాడులు కొనసాగాయి. ట్రంప్‌ పోస్ట్‌ చేసిన ఆరు గంటల తర్వాత కాల్పుల విరమణను మొదలుపెట్టామని ఇరాన్ ప్రకటించింది. తాజాగా ఇజ్రాయెల్ కూడా కాల్పుల విరమణకు అంగీకరించింది. 

Also Read: బిలావల్ భుట్టో బలుపు మాటలు.. ఇండియాని రెచ్చగొడుతున్న పాకిస్తాన్

 

Advertisment
Advertisment
తాజా కథనాలు