/rtv/media/media_files/2025/04/30/8cbqmihzeSkVpdtz03ew.jpg)
das bail
దేశద్రోహం కేసులో ఇస్కాన్కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ బంగ్లాదేశ్లో అరెస్టైన విషయం తెలిసిందే.. తాజాగా ఆయనకు బెయిల్ మంజూరు అయింది. గత ఏడాది అక్టోబర్ 30న చిట్టగాంగ్ లో ఆయనతో పాటు మరో 18 మందిపై దేశద్రోహం కేసు నమోదైనప్పుడు చెలరేగిన వివాదం నేపథ్యంలో దాస్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆరు నెలల తర్వాత అతనికి బంగ్లాదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. చిన్మోయ్ తరపున దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన తర్వాత జస్టిస్ ఎండీ అటోర్ రెహమాన్, జస్టిస్ ఎండీ అలీ రెజాలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read : ఆ సమస్యలను పరిష్కరించండి...కేంద్ర మంత్రితో ఎంపీ సానా సతీష్ బాబు భేటీ!
Also Read: మనకు అణ్వాయుధాలున్నాయి..మనల్నేం చేయలేరు....మరియం నవాజ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు
Chinmoy Krishna Das Brahmachari, spokesperson for the Bangladesh Sammilita Sanatani Jagaran Jote, has been granted bail by the High Court in a sedition case related to the alleged desecration of the national flag: Bangladeshi Media pic.twitter.com/5XUhtDW4TM
— IANS (@ians_india) April 30, 2025
కాషాయ జెండాను ఎగురవేశారని
అక్టోబర్ 25న చటోగ్రామ్ లోని లాల్దిఘి మైదాన్ లో జరిగిన ర్యాలీలో బంగ్లాదేశ్ అధికారిక జెండాపై కాషాయ జెండాను ఎగురవేశారని ఆయనపై ఈ అభియోగాలు ఉన్నాయి. ఈ అరెస్టుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది, పలువురు ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా మైనారిటీల హక్కులు, భద్రతను సమర్థించే బంగ్లాదేశ్ సమ్మిలిత సనాతని జాగ్రన్ జోట్ అనే సంస్థకు చిన్మయ్ కృష్ణదాస్ ప్రతినిధిగా పనిచేస్తున్నారు.
Also Read: పాక్కు భారత్ మరో ఊహించని షాక్.. అప్పు ఇవ్వొద్దని IMFకు కంప్లైంట్!
Also Read : Haryana: ఆ నీరు పాకిస్థాన్కు వెళ్లొద్దు.. హర్యానా కీలక ప్రకటన
telugu-news | Chinmoy Krishan Das