/rtv/media/media_files/2025/06/26/iran-supreme-leader-ali-khamnei-2025-06-26-19-17-54.jpg)
Iran supreme leader Ali Khamnei
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఎక్కడున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. కాల్పుల విరమణ జరిగినప్పటికీ ఆయన బయటికి రాలేదు. అయితే తాజాగా ఆయన స్పందించారు. 12 రోజుల పాటు ఇజ్రాయెల్పై సాగిన యుద్ధంలో తమ దేశమే గెలిచిందని ప్రకటించారు. అలాగే తాము అమెరికా స్థావరాలపై కూడా దాడులు చేసి ఆ దేశానికి చెంపదెబ్బ కొట్టామన్నారు.
Also Read: అప్పుడు వయనాడ్ ఇప్పుడు హిమాచల్ప్రదేశ్.. అసలు క్లౌడ్ బరస్ట్ ఎలా ఏర్పడుతుందో తెలుసా?
జూన్ 19 తర్వాత మొదటి సారిగా ఇరాన్ ప్రభుత్వ మీడియా అలీ ఖమేనీ వీడియోను ప్రసారం చేసింది. అమెరికా జోక్యం చేసుకోకపోతే ఇజ్రాయెల్ నాశనమవుతుందని అనుకొని అగ్రరాజ్యం ఈ యుద్ధంలో జోక్యం చేసుకుందని ఖమేనీ అన్నారు. కానీ ఈ యుద్ధం వల్ల అమెరికా ఎలాంటి ప్రయోజనాలు సాధించలేకపోయిందని సెటైర్ వేశారు. ఖతార్లోని అమెరికా కీలక స్థావరాల్లో ఒకటైన అల్ ఉదీద్ వైమానిక స్థావరంపై దాడులు చేశామన్నారు.
Also Read: కాల్పుల విరమణ జరిగినా బయటకు రాని ఖమేనీ.. హత్యకు ప్లాన్ చేస్తున్న ఇజ్రాయెల్ !
ఇందులో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. అలాగే ఇస్లామిక్ రిపబ్లిక్ ఈ ప్రాంతంలో కీలకంగా ఉన్న కేంద్రాలను యాక్సెస్ చేయలగలదని తెలిపారు. అవసరమైతే ఆ ప్రాంతాల్లో దాడులు కూడా చేయగలమని.. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కావొచ్చని అన్నారు. ఇరాన్కు ఏదైన దురాక్రమణ జరిగితే శత్రువు భారీమూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది వార్నింగ్ ఇచ్చారు. ఇదిలాఉండగా.. గత కొన్నిరోజులుగా జరిగిన ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ముగిసిన సంగతి తెలిసిందే. అమెరికా ప్రతిపాదనతో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి.
Also Read: అంతరిక్షంలో ఆరోగ్యం బాగోలేదన్న ఇండియన్ ఆస్ట్రోనాట్ శుభాన్షు శుక్లా