Israel-Iran War: ఇజ్రాయెల్‌లో ఆస్పత్రిపై ఇరాన్ దాడులు.. పరుగులు తీసిన వైద్యులు, పేషెంట్లు

ఇజ్రాయెల్‌ రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసేందుకు ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇజ్రాయెల్‌లోని ప్రధాని ఆస్పత్రి సోరోఖాపై కూడా బాంబు దాడి జరిగింది. ఈ దాడుల్లో ఆస్పత్రి ధ్వంసమయ్యింది.

New Update

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు ముదురుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌ పైకి ఇరాన్ క్షిపణులు ప్రయోగిస్తోంది. ఇజ్రాయెల్‌ రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసేందుకు బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇజ్రాయెల్‌లోని ప్రధాని ఆస్పత్రి సోరోఖాపై కూడా బాంబు దాడి జరిగింది. ఈ దాడుల్లో ఆస్పత్రి ధ్వంసమయ్యింది. బాంబులు పడటంతో పేషెంట్లు, డాక్టర్లు బయటకు పరుగులు పెట్టారు. అలాగే శిథిలాల కింద వందలాది మంది పేషెంట్లు చిక్కుకున్నారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Also Read: అమెరికాలో చదువుకోవాలనుకునే వారికి గుడ్‌న్యూస్‌.. మళ్లీ వీసాలు షురూ

ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ హైపర్‌ సోనిక్ క్షిపణులతో దాడులకు దిగింది. 'ఫతా1' మిసైల్స్‌తో దాడులు చేస్తోంది. ముఖ్యంగా సైనిక స్థావరాలు, ఎయిర్‌బేస్‌లు లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి.   

Also Read: ఇరాన్‌పై ట్రంప్ సీక్రెట్ వార్ ప్లాన్.. ఇజ్రాయిల్ అండగా రంగంలోకి అమెరికా!

Advertisment
Advertisment
తాజా కథనాలు