/rtv/media/media_files/2025/06/20/first-test-2025-06-20-07-44-58.jpg)
India-England
సీనియర్లు అందరూ నెమ్మదిగా తప్పుకున్నారు. ప్రస్తుతం భారత జట్టు అంతా యువ రక్తంతో నిండి ఉంది. ఇందులో కొంత మందికి బాగా ఆడిన అనుభవం ఉంది. రోహిత్ శర్మ సారధ్యంలో తమ ప్రతిభలను చాలాసార్లే నిరూపించుకున్నారు. కానీ ఇప్పుడు కెప్టెన్ కొత్తవాడు. పైగా ఆడుతున్నది ఇంగ్లాండ్ జట్టుతో. రికార్డ్ లో, అనుభవంలో కూడా ఆ జట్టు కంటే తక్కువే. అలాంటి పరిస్థితుల్లో శుభ్మన్ గిల్ నేతృత్వంలోని టీమ్ఇండియా ఆట ఎలా ఉండబోతోంది? ఇంగ్లాండ్లో పరిస్థితులకు నిలబడుతుందా? బ్రిటీష్ టీమ్ ను కట్టడి చేయగలుగుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
భారత జట్టుకు కొత్త శకం..
కొత్త కెప్టెన్ సారథ్యంలో ఇంగ్లాండ్ లో టెస్ట్ సీరీస్ ఆడ్డానికి సిద్ధమైంది భారత జట్టు. ఈ సమరానికి ఈరోజే ప్రారంభం. లీడ్స్ లో మొదటి టెస్ట్ ఇవాళ మొదలవనుంది. టీమ్ ఇండియాకు కొత్త శకం మొదలవనుంది. టెస్టుల్లో బ్యాటర్గా రికార్డు గొప్పగా లేకపోయినా కెప్టెన్సీని దక్కించుకున్న అతడు నిరూపించుకోవాల్సింది చాలానే ఉంది. దాని తోడు సొంతగడ్డపై ఆడుతున్న ఇంగ్లాండ్ ను ఓడించడం అంత సులువేమీ కాదు. పైగా అక్కడ భారత్ టెస్ట్ సీరీస్ నెగ్గి 18 ఏళ్ళు అయింది. ఇలాంటి నేపథ్యంలో కెప్టెన్ గిల్ కు జట్టును నడిపించడం పెద్ద సవాలే. మరోవైపు స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లాండ్ జట్టు ‘బజ్బాల్’ ఆటతో భారత్ను దెబ్బతీయడానికి సిద్ధమవుతోంది.
సవాల్ విసరుతున్న అనుభవ లేమి..
ఈ టెస్ట్ సీరీస్ ఎలా లేదన్నా భారత్ కు సవాలే అనడంలో ఎటువంటి సందేహం లేదు. అవతలి టీమ్ లో అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ వంటి ఫాస్ట్ బౌలర్లు లేకపోయినా..బ్యాటింగ్ లో అనుభవ లేమి భారత్ కు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న బ్యాటర్లు అందరికీ కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడిన అనుహవం ఉంది. ఇప్పుటు టెస్ట్ లలో వారు ఎలా రాణిస్తారో చూడాల్సిందే. అంతెందుకు కెప్టెన్ గిల్ కే ఇంగ్లాండ్ లో పేలవమై రికార్డ్ ఉంది. కోహ్లి ఖాళీ చేసిన నాలుగో స్థానంలో కెప్టెన్ గిల్ బ్యాటింగ్కు వస్తాడు. అయిదో స్థానంలో రిషబ్ పంత్ ఆడతాడు. జైస్వాల్తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశముంది. సాయి సుదర్శన్ మూడో స్థానంలో దిగొచ్చు. ఇందులో రాహుల్ ఒక్కడే కాస్తో కూస్తూ నమ్మకం ఉంచదగ్గ బ్యాటర్ కింద కనిపిస్తున్నాడు ప్రస్తుతానికి. ఇక బౌలింగ్లో ఎప్పటిలాగే భారత్కు బుమ్రా కీలకం. అతడిపై పెద్ద బాధ్యతే ఉంది. ఇతనికి తోడుగా ఎవరు వస్తారన్నది మాత్రం ఇంకా తెలియడం లేదు. జట్టులో ఏకైక స్పిన్నర్ జడేజా తుది జట్టులో కచ్చితంగా అయితే ఉంటాడు.
పిచ్ రిపోర్ట్..
పిచ్పై కాస్త పచ్చిక ఉంది. ఆరంభంలో కాస్త పేసర్లకు సహకరించినా.. వేడి, పొడి వాతావరణంలో మ్యాచ్ సాగుతున్నకొద్దీ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా మారుతుంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశముంది. హెడింగ్లీలో ఏడు టెస్టులాడిన టీమ్ఇండియా.. రెండు గెలిచి నాలుగు ఓడిపోయింది. ఓ మ్యాచ్ను డ్రాగా ముగించింది.
తుది జట్లు...
ఇంగ్లాండ్:
క్రాలీ, డకెట్, ఒలీ పోప్, రూట్, హారీ బ్రూక్, స్టోక్స్, జేమీ స్మిత్, వోక్స్, బ్రైడన్ కార్సీ, జోష్ టంగ్, బషీర్
భారత్ (అంచనా):
జైస్వాల్, రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, పంత్, కరుణ్ నాయర్, శార్దూల్/నితీశ్, జడేజా, బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.