నేను తలుచుకుంటే ఉక్రయిన్‌ సైన్యం కుప్పకూలుతుంది: ఎలాన్‌మస్క్‌

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ స్టార్‌లింక్‌ సేవలను నిలివేస్తే.. ఉక్రెయిన్‌ సేనలు కుప్పకూలిపోతాయంటూ హెచ్చరించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Elon Musk and Zelensky

Elon Musk and Zelensky

ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. రష్యాతో యుద్ధం కొనసాగేలా చేస్తున్నారని జెలెన్‌స్కీ తీవ్రంగా ఆరోపణలు చేశారు. తాజాగా ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ స్టార్‌లింక్‌ సేవలను నిలివేస్తే.. ఉక్రెయిన్‌ సేనలు కుప్పకూలిపోతాయంటూ హెచ్చరించారు. యుద్ధం విషయంలో పుతిన్‌ను  పక్కనపెట్టి ఉక్రెయిన్‌ను ఎందుకు టార్గెట్‌ చేసుకుంటున్నారనే ట్వీట్‌పై ఎలాన్‌ మస్క్‌ ఇలా స్పందించాడు.  

Also Read: బర్డ్ ఫ్లూ భయంతో అమెరికాలో కోడిగుడ్లు స్మగ్లింగ్.. అద్దెకు కోడిపెట్టలు

'' ఉక్రెయిన్‌ అంశంలో చర్చలకు రావాలని గతంలో పుతిన్‌కు సవాలు చేశాను. కీవ్‌ సైన్యానికి కూడా మా స్టార్‌లింక్ వ్యవస్థ సపోర్ట్‌ చేస్తోంది. ఒకవేళ ఈ సేవలు నిలిపివేస్తే.. యుద్ధక్షేత్రంలో ఉక్రెయిన్‌ సైన్యం కుప్పకూలుతుంది. ఉక్రెయిన్ ఓటమి అనివార్యం. అయినాకూడా ఏళ్లుగా సాగుతున్న ఊచకోత విసుగు పుట్టిస్తోంది. వాస్తవికతో ఆలోచించేవారు, అర్థం చేసుకునేవారు ఎవరైనా ఈ యుద్ధాన్ని ఆపాలని కోరుకుంటారని'' ఎలాన్‌ మస్క్‌ అన్నారు. 

‘‘ఉక్రెయిన్‌ విషయంలో ముఖాముఖికి రావాలంటూ గతంలో పుతిన్‌కు సవాలు విసిరాను. మరోవైపు.. కీవ్‌ సైన్యానికి మా స్టార్‌లింక్ వ్యవస్థ వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఒకవేళ ఈ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేస్తే.. రణరంగంలో కీవ్‌ సేనలు కుప్పకూలుతాయి. ఏదేమైనా ఉక్రెయిన్‌కు ఓటమి అనివార్యం. అయినప్పటికీ.. ఏళ్ల తరబడి సాగుతున్న ఊచకోత విసుగు పుట్టిస్తోంది. వాస్తవికతతో ఆలోచించేవారు, అర్థం చేసుకునేవారు ఎవరైనా ఈ యుద్ధాన్ని ఆపాలని కోరుకుంటారు’’ అని మస్క్‌ పేర్కొన్నారు.

Also Read: జైలు నుంచి బెయిల్‌పై బయటకొచ్చి.. కుంభమేళాలో జాక్‌పాట్ కొట్టిన రౌడీ‌షీటర్

ఇదిలాఉండగా.. వైట్‌హౌస్‌ దగ్గర్లో భారీ ఉక్రెయిన్‌ జెండా ఆవిష్కరణకు నిధులు ఎవరు ఇచ్చారని ఓ నెటిజెన్‌ ఎక్స్‌ వేదికగా అడిగిన ప్రశ్నకు మస్క్‌ ఇలా స్పందించారు. '' ఉక్రెయిన్‌కు చెందిన ఉన్న టాప్‌ 10 సంపన్నులపై, ముఖ్యంగా మొనాకోలోని విలాస భవనాలు ఉన్నావారిపై ఆంక్షలు విధించాలి. ఆ తర్వాత ఇలాంటి కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుందని'' మస్క్‌ అన్నారు.   

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Israel-gaza: గాజాలో మారణహోమం.. మరో 27 మంది మృతి

గాజాలో మానవతా సహాయ కేంద్రం వద్ద ఇజ్రాయెల్ దళాలు మరోసారి దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. డజన్ల కొద్ది ప్రజలు గాయాలపాలయ్యారు. గత 3 రోజుల నుంచి సహాయ కేంద్రాల వద్ద ఈ దాడులు జరుగుతున్నాయి.

New Update
At least 27 Palestinians killed by Israeli fire near aid centre, Gaza authorities say

At least 27 Palestinians killed by Israeli fire near aid centre, Gaza authorities say

గాజాపై ఇజ్రాయెల్‌ భీకర దాడులు కొనసాగిస్తూనే ఉంది. గత కొన్నిరోజులుగా జరుగుతున్న దాడుల వల్ల గాజాలో వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మానవతా సహాయ కేంద్రం వద్ద IDF దళాలు మరోసారి దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. డజన్ల కొద్ది ప్రజలు గాయాలపాలయ్యారు.  ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం గాజా దక్షిణ ప్రాంతంలోని సహాయ కేంద్రం దగ్గర మానవతా సాయం పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. 

Also Read: ఇకనుంచి ఒకటవ తరగతి నుంచే బేసిక్‌ మిలిటరీ శిక్షణ !

ఇదే సమయంలో ఇజ్రాయెల్ కాల్పులకు దిగింది. ఈ దాడుల్లో 27 మంది అమాయకులు మృత్యువాతపడ్డారు. గత 3 రోజుల నుంచి సహాయ కేంద్రాల వద్ద ఈ దాడులు జరుగుతున్నాయి. ప్రస్తుతం వేలాది మంది పాలస్తీనియన్లు అక్కడ మానవతా సాయం తీసుకోవడం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలోనే ఇజ్రాయెల్ దాడులు జరపడం కలకలం రేపుతోంది. ఆకలితో అలమటిస్తున్న గాజా పౌరులపై ఇజ్రాయెల్ దాడులు చేయడాన్ని హమాస్‌ తీవ్రంగా ఖండించింది. 

మరోవైపు రఫాలోని తమ ఆస్పత్రిలో ఇప్పటిదాకా 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీ ప్రతినిధి వెల్లడించారు. 19 మంది అక్కడికి వెళ్లే లోపు మృతి చెందినట్లు తెలిపారు. మరికొందరికి తక్షణమే వైద్యం అవసరం ఉందని పేర్కొన్నారు. ఇదిలాఉండగా 2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై హమాస్‌ మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి హమాస్ అంతమే లక్ష్యాంగా ఇజ్రాయెల్‌ గాజాపై విరుచుకుపడుతోంది. 

Also Read: యుద్ధాల్లో దుమ్ము రేపుతోన్న డ్రోన్లు.. వేల కి.మీ దాటి శత్రువులపై దాడులు

ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న పోరులో ఇప్పటిదాకా గాజాలో 54 వేల మందికి పైగా మృతి చెందినట్లు అక్కడి స్థానిక యంత్రాంగం తెలిపింది. ఇటీవలే అక్కడ మానవతా సాయాన్ని పరిమితంగా అందించేందుకు ఇజ్రాయెల్ పర్మిషన్ ఇచ్చింది. అయితే ఈ సమయంలో కూడా అక్కడ దాడులు జరగడం కలకలం రేపుతోంది. 

telugu-news | rtv-news | israel | gaza

Advertisment
Advertisment