/rtv/media/media_files/2025/05/12/PT7X6epf3Kvbc4n3j45Z.jpg)
Difference Between S-400 And S-500 Missile System
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్.. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్, POKలో ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పాకిస్థాన్ భారత్లోని జమ్మూ, పంజాబ్, రాజస్థాన్లోని సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లు, క్షిపణులు, ఫైటర్ జెట్లతో దాడులకు యత్నించింది. కానీ మన భారత సైన్యం వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. దీంతో భారత్లో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం కూడా జరగలేదు. దీనికి ముఖ్యకారణం మనకు పటిష్ఠమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉండటం వల్లే. అందులో కీలకమైనది S-400 మిసైల్ సిస్టమ్.
Also Read: మోస్ట్ డేంజరస్ వీడియోలు.. గజగజ వణుకు పుట్టాల్సిందే!
ఈ S 400 మిసైల్ సిస్టమ్ పాకిస్థాన్ ప్రయోగించిన డ్రోన్లు, మిసైళ్లు, ఫైటర్ జెట్లను తిప్పికొట్టి గాల్లోనే పేల్చివేసింది. ప్రపంచంలోనే అత్యుత్తమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్గా S-400 గుర్తింపు తెచ్చుకుంది. 2018లో రష్యాతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా వాటిని రూ.35 వేల కోట్లతో భారత్ ఐదింటిని కొనుగోలు చేసింది. ఇప్పటికే మూడు ఎస్400 మిసైల్ సిస్టమ్స్ భారత్లో ఉన్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మరో రెండు S-400 మిసైల్ సిస్టమ్స్ 2026 లేదా 2027లో రావొచ్చని తెలుస్తోంది.
Also Read : DGMO చర్చల్లో భారత్, పాక్ డిమాండ్లు ఇవే
S-400 మిసైల్ సిస్టమ్
సుదర్శన చక్రగా పిలిచే ఈ ఎస్-400 మిసైల్ సిస్టమ్.. దేశంలో ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లో మోహరించారు. ఇది యుద్ధ విమానాలతో పాటు డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులు లాంటి అనేక వైమానిక దాడులను ముందుగానే వాటిని గాల్లోనే పేల్చేయగల సామార్థ్యం దీనికి ఉంటుంది. ఈ S-400 మిసైల్ సిస్టమ్ 17000 కి.మీ వేగంతో పనిచేస్తుంది. ఇది దాదాపుగా 400 కి.మీ వరకు ఉన్న శత్రుదాడులను కూడా ఈజీగా గుర్తిస్తుంది. ఒకేసారి 36 క్షిపణులను టార్గెట్ చేసి వాటిని నాశనం చేస్తుంది. అలాగే ఒకే కోణంలో కాకుండా 360 డిగ్రీల కోణంలో వచ్చిన వాటిని కూడా ధ్వంసం చేస్తుంది.
Also Read: విక్రమ్ మిస్రీపై ట్రోలింగ్.. అసదుద్దీన్ ఒవైసీ సంచలన ట్వీట్!
S-500 మిసైల్ సిస్టమ్
S-500 అనేది S-400 కన్నా అధునాతన క్షిపణి వ్యవస్థ. ఇది హైపర్సోనిక్ మిసైల్స్, లోఆర్బిట్ శాటిలైట్లను కూడా తిప్పికొట్టగలదు. S-4--00 అనేది 400 కిలోమీటర్ల రేంజ్ వరకు మాత్రమే శత్రువుల క్షిపణులను కూల్చేయగదు. కానీ S-5-00 ఏకంగా 600 కిలోమీటర్ల రేంజ్లో శత్రుదాడులను తిప్పికొట్టగలదు. దీనిలో ఉండే అడ్వాన్స్డ్ యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ అర్రే (AESA) రాడర్ ఏకంగా 2 వేల కిలోమీటర్ల దూరంలో నుంచే టార్గెట్లను గుర్తించగలదు. అయితే ఈ S-500 క్షిపణి వ్యవస్థను భారత్ ఇంకా కొనుగోలు చేయలేదు. అయితే రష్యా భారత్తో S-500 క్షిపణి వ్యవస్థను ఉమ్మడిగా ఉత్పత్తి చేసేందుకు ప్రతిపాదన చేసింది. దీంతో త్వరలో S-500 క్షిపణి వ్యవస్థ కూడా భారత్కు రానుంది. ఇవి భారత్కు వస్తే ప్రపంచంలో శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కలిగిఉన్న దేశంగా భారత్ నిలవనుంది.
🚨 BREAKING NEWS
— Megh Updates 🚨™ (@MeghUpdates) May 12, 2025
Russia proposes joint production of S-500 air defense system to India again. pic.twitter.com/vWtsMHYwzq
Also Read : పీవీకి అరుదైన గౌరవం
telugu-news | rtv-news | india pakistan war