/rtv/media/media_files/2025/01/14/Dcthyu8Lz0cszqGSDkwA.jpg)
Mine
దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బంగారు గనిలో చిక్కుకొని ఏకంగా 100 మంది కార్మికులు మృతి చెందడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. దక్షిణాఫ్రికాలోని బంగారు గనుల్లో అక్రమంగా తవ్వకాలు జరిపేందుకు వందలాది మంది వెళ్లారు. కానీ వాళ్లు అక్కడే చిక్కుకుపోయారు. కొన్ని నెలలుగా వాళ్లు అందులోనే ఉండిపోయారు. చివరికి పౌర సంఘాల ఒత్తిడితో అక్కడి ప్రభుత్వం రంగంలోకి దిగింది. కార్మికులను రక్షించేందుకు యత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
Also Read: సౌదీకి వెళ్లాలనుకునేవారికి బిగ్ షాక్.. రూల్స్ మరింత కఠినం
గనిలో చిక్కుకున్న వారిలో దాదాపు 100 మందికి పైగా కార్మికులు మృతి చెందారని అధికారులు తెలిపారు. వీళ్లు ఆకలి, డీహైడ్రేషన్తో మరణించినట్లు అంచనా వేస్తున్నారు. అయితే జనవరి 10 నుంచి ఇప్పటిదాకా గనిలో చిక్కుకున్న వారిని సురక్షితంగా రక్షించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 24 మంది మృతదేహాలను బయటకు తీసినట్లు పేర్కొన్నారు. జనవరి 14న 8 మందిని ప్రాణాలతో మరో ఆరు మృతదేహాలను బయటకు తీశారు. అయితే మరో 500 మంది ఇంకా భూగర్భంలోనే ఉన్నట్లు భావిస్తున్నారు. వాళ్లు కూడా ఆకలి, అనారోగ్యంతో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
Also Read: నీ గూగుల్ సెర్చ్కు గత్తర రాను.. చావు తర్వాత ఏమిటని వెతికి..!
ఇదిలాఉండగా.. దక్షిణాఫ్రికాలో బంగారు నిల్వలు ఎక్కువగా ఉంటాయి. అక్కడ అక్రమంగా మైనింగ్ చేయడం సాధారణమే. వందల సంఖ్యలో ఉన్నటువంటి పాడుపడిన బంగారు గనులు వీటికి అడ్డాగా మారిపోయాయి. అయితే తవ్వకాల కోసం గనుల్లోకి వెళ్లే కార్మికులు నెలల పాటు అందులోనే ఉండిపోతున్నారు. ఇందుకోసం వారు ఆహారం, నీటితో పాటు జనరేటర్లు, ఇతర అవసరమైన వస్తువులు తీసుకెళ్తారు. అయితే ఇటీవల వెళ్లిన కార్మికుల్లో దాదాపు 100 మంది వరకు మృతి చెందడం కలకలం రేపుతోంది.
Also Read: మైనర్ బాలిక రేప్ కేసులో సంచలన విషయాలు.. 44 మంది అరెస్ట్