/rtv/media/media_files/2025/04/24/4QJuQ6msvih0tSbVqGt7.jpg)
Pak Army Chief Asif Munir, Osama bin Laden
ఒక పందికి లిప్ స్టిక్ వేసినా అది పందేనని మాజీ పెంటగాన్ అధికారి మైఖల్ రూబిన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది పాకిస్తాన్ గురించి ఆయన చెప్పిన మాటలు. జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడి యాదృచ్ఛికంగా జరిగింది కాదని, పాకిస్థాన్ పక్కా ప్రణాళికతో నిర్వహించిందని రూబిన్ ఆరోపించారు. పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ ఆసిమ్ మునీర్ ను చనిపోయిన అల్ ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ లాంటివాడని అన్నారు. అమెరికన్ ఎంటర్ప్రైజ్ ఇన్స్టిట్యూట్ సీనియర్ ఫెలో అయిన రూబిన్ ఎన్ఐఏకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. పహల్గామ్ దాడికి అమెరికా తీసుకోవాల్సిన చర్య ఒకే ఒక్కటి ఉంది. అది పాక్ ను అధికారికంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంగా గుర్తించడమే అని అన్నారు. బిల్ క్లింటన్ ఇండియా వెళ్ళినప్పుడు ఉగ్రదాడి జరిగింది. ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అక్కడ ఉన్నప్పుడే ఉగ్రవాదులు దాడి చేశారు. ఇదంతా పాకిస్తాన్ దృష్టిని మళ్ళించేందుకే చేస్తోందని రూబిన్ అన్నారు.
కాశ్మీర్ మాది అంటూ వ్యాఖ్యలు..
కాశ్మీర్ లోని పహల్గామ్ దాడికి వారం రోజుల ముందు పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ ఆసిమ్ మునీర్ కాశ్మీర్ పై విద్వేష పూరిత వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ పాకిస్తాన్ జీవనాడి అని..దానిని తాము ఎప్పటికీ వదులుకోమని అన్నారు. ఈ మాటలే ఉగ్రవాదులకు ఊతమిచ్చాయని..ఆ ధైర్యంతోనే వారు కాశ్మీర్ లో దాడులకు తెగబడ్డారని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు పెంటగాన్ మాజీ అధికారి కూడా ఈ వాదనను సమర్థించారు.
పహల్గామ్లోని బైసరన్ లోయలో లష్కరే తొయిబా అనుబంధ విభాగం టీఆర్ఎఫ్ టెర్రరిస్టులు.. పర్యాటకులపై కాల్పులకు తెగబడి 26 మందిని పొట్టనబెట్టుకున్నారు. మరో 20 మందిని తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనతో భారత్, పాకిస్థాన్ల మధ్య మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
today-latest-news-in-telugu | usa | pakistan | pentagon | Pakistan Army Chief | osama-bin-laden
Also Read: USA: వీసాల రద్దు ఆపండి..విద్యార్థులకు అమెరికా న్యాయస్థానం ఊరట