/rtv/media/media_files/2025/01/19/DCeDkVeosWnt8SRWKkl1.jpg)
America key orders to citizens and diplomats in Lahore
BIG BREAKING: భారత్, పాక్ యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాహోర్పై దాడులు జరిగే అవకాశం ఉండటంతో తమ రాయబారులను అక్కడినుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించింది. స్థానిక అధికారుల నుంచి సహాయం తీసుకోవాలని సూచించింది.
బయట తిరగొద్దు..
పాకిస్తాన్లోని లాహోర్ పరిసర ప్రాంతాల్లో డ్రోన్ పేలుళ్లు, గగనతల దాడుల భయాల మధ్య అమెరికా రాయబార కార్యాలయం తన సిబ్బంది, పౌరులకు ఒక హెచ్చరిక జారీ చేసింది. వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, లేదంటే ఎక్కడున్నారో అక్కడే స్థిరంగా బయటకు వెళ్లకుండా ఉండాలని అమెరికా ప్రభుత్వం సూచించింది.
Also Read: పాకిస్తాన్కి చుక్కలు చూపించిన సుదర్శన్ చక్రం.. భారత్కు శ్రీరామ రక్షలా రష్యా S-400
మరోవైపు.. భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇవాళ పాక్లోని రావల్పిండి క్రికెట్ స్టేడియం సమీపంలో డ్రోన్ అటాక్ జరిగినట్లు తెలుస్తోంది. స్టేడియానికి సమీపంలోనే దాడి జరిగినట్లు ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ స్టేడియంలో ఇవాళ (మే8) రాత్రి 8గంటలకు పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో భాగంగా పెషావర్ జల్మి vs కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.
Also Read: గగన్యాన్ వ్యోమగామికి వాయుసేన పిలుపు.. యుద్ధ విమానాలు సిద్ధం!
america | india | pakistan | telugu-news | today telugu news