Floods in South Africa : వరదల బీభత్సం.. 49 మంది మృతి!

దక్షిణాఫ్రికాలో వరదలు విలయం సృష్టిస్తున్నాయి. తూర్పు కేప్ ప్రావిన్స్‌లో వరదల కారణంగా ఇప్పటివరకు 49 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాలు భారీ వర్షం, మంచుతో అతలాకుతలం అయ్యాయని తెలిపారు. అనేక ప్రాంతాలు నీటి ముంపునకు గురయ్యాయి,

New Update
49 dead in South Africa floods

49 dead in South Africa floods

Floods in South Africa : దక్షిణాఫ్రికాలో వరదలు విలయం సృష్టిస్తున్నాయి. తూర్పు కేప్ ప్రావిన్స్‌లో వరదల కారణంగా ఇప్పటివరకు 49 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాలు భారీ వర్షం, మంచుతో అతలాకుతలం అయ్యాయని తెలిపారు. స్కూల్ బస్సు కొట్టుకుపోగా.. తీవ్రమైన చలి కారణంగా రవాణా, విద్యుత్‌కు అంతరాయం కలుగుతున్నట్లు చెప్పారు.

Also Read: సూపర్ సిక్స్ లో మరో ముఖ్యమైన హామీకి గ్రీన్ సిగ్నల్..వారి ఖాతాల్లోకి రూ.15 వేలు

దక్షిణాఫ్రికాలోని తూర్పు కేప్ ప్రావిన్స్‌లో భారీ వర్షాల కారణంగా వరదలు విలయం సృష్టిస్తున్నాయి. ఈ వరదల కారణంగా అనేక ప్రాంతాలు నీటి ముంపునకు గురయ్యాయి, ప్రజలు నిరంతరం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదల కారణంగా ప్రజల ఆస్తులకు, ఇళ్లకు, వ్యాపారాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరదల కారణంగా చాలా మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. 

Also Read :  ప్రధాని మోదీకి మ‌ల్లిఖార్జున్ ఖర్గే సంచలన లేఖ.. ఎందుకంటే..?
 
వరదల వల్ల రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లింది, దీంతో ఆ ప్రాంతాల్లో రవాణా,ఇతర అవసరమైన సేవలు ఆగిపోయాయి. వరదల కారణంగా ప్రజలు తమ ఇళ్లను , ఆస్తిని కోల్పోయారు, కొన్ని కుటుంబాలు నిరంతరం సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. వరదలు తాగునీటిని కలుషితం చేశాయి, ప్రజలు తాగునీరు. పారిశుద్ధ్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. వరదలు వాతావరణ మార్పుల కారణంగా సంభవిస్తున్నాయని  శాస్త్రవేత్తలు భావిస్తున్నారు, వాతావరణ మార్పులు మరింత తీవ్రమైన వాతావరణ సంఘటనలకు కారణమవుతున్నాయి. 

Also Read: విమానం మెట్లు ఎక్కుతుండగా జారిపడ్డ ట్రంప్.. వీడియో వైరల్

Advertisment
Advertisment
తాజా కథనాలు