/rtv/media/media_files/2025/10/08/11-paramilitary-troops-killed-in-ttp-ambush-near-afghan-border-2025-10-08-14-40-31.jpg)
11 paramilitary troops killed in TTP ambush near Afghan border
పాకిస్థాన్లో మళ్లీ బాంబు దాడి జరగడం కలకలం రేపింది. సాయుధ బలగాలు వెళ్లే వాహనంపై మిలిటెంట్లు కాల్పులకు పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు అధికారులతో సహా 11 మంది పారామిలిటరీ సిబ్బంది మృతి చెందినట్లు తెలుస్తోంది.ఇక వివరాల్లోకి వెళ్తే.. అఫ్గానిస్థాన్ సరిహద్దుకు సమీపంలో కుర్రం జిల్లాలో పాక్ సైన్యం కాన్వయ్పై మిలిటెంట్లు ఈ దాడులు చేశారు. దాడికి పాల్పడిన వారి కోసం అక్కడి భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి.
BREAKING: Tehreek-E-Taliban kills 11 Pakistan Army soldiers in an ambush in Khyber Pakhtunkhwa. Reports suggest several Pak Army officers remain missing. Asim Munir finding out what happens when you f#uk around pic.twitter.com/20z2GhF2kH
— Atishay Jain (@AtishayyJain96) October 8, 2025
Also Read: భారత్తో యుద్ధం.. పాకిస్థాన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
కానీ ఈ దాడులకు సంబంధించి ఇప్పటిదాకా పాక్ ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన రిలీజ్ చేయలేదు. అయితే తెహ్రీక్ తాలిబన్ పాకిస్థాన్ (TTP) ఈ దాడికి తమదే బాధ్యత అని ప్రకటన చేసినట్లు ప్రచారం నడుస్తోంది. గత కొంతకాలంగా అఫ్గానిస్థాన్-పాకిస్థాన్ సరిహద్దు నుంచి టీటీపీ గ్రూప్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన అనంతరం పాక్కు వ్యతిరేకంగా ఆ దేశ భద్రతా సిబ్బంది, ప్రజలే టార్గెట్ ఈ గ్రూప్ ఇంతకుముందు కూడా పలుమార్లు దాడులకు పాల్పడింది.
Also Read: ఉక్రెయిన్ దళాల చేతిలో..రష్యా సైన్యంలోని భారతీయుడు..నిర్థారిస్తామన్న విదేశాంగ శాఖ