Chandrababu: ఫైబర్‌ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై సుప్రీంకోర్టులో నేడు విచారణ

టీడీపీ అధినేత చంద్రబాబు మీద ఉన్న ఫైబర్ నెట్ కేసులో ఆయన దాకలు చేసిన ముందస్తు బెయిల్ మీద నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేయడంతో సుప్రీంలో సవాల్ చేశారు. చంద్రబాబు.

Chandrababu : చంద్రబాబు కేసు విచారణ... చివరిలో ఊహించని ట్విస్ట్!
New Update

Fibernet Case - Chandrababu: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం వేరు వేరు అభిప్రాయాలు వ్యక్తం చేసింది. దీంతో ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపించారు. మరోవైపు ఏపీ ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ మీద చంద్రబాబు దాకలు చేసిన ముందస్తు బెయిల్ మీద ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ ముందస్తు బెయిల్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) నిరాకరించింది. దీంతో బాబు హైకోర్టు తీర్పును...సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.

Also Read:హైదరాబాద్‌నూ ముంచెత్తిన పొగమంచు..విమానాలు రద్దు

ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ...

సుప్రీంకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. ఇదే కేసులో ఇంతకు ముందు 17 ఏ పై స్పష్టత వచ్చిన తర్వాత విచారణ చేస్తామని కోర్టు తెలిపింది. దాంతో పాటూ నిన్న స్కిల్ స్కామ్‌లో (AP Skill Scam) ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఈరోజు విచారణలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. ఇప్పుడు ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణచేయనుంది.

అసలేంటీ ఫైబర్ నెట్ కేసు..

టెర్రా సాఫ్ట్ కంపెనీకి నిబంధనలకు విరుద్దంగా… కాంట్రాక్టు కట్టబెట్టారని ఆరోపణలు చేసింది. అప్పటికే టెర్రా సాఫ్ట్ కంపెనీ బ్లాక్‌ లిస్ట్‌లో ఉందని.. మొత్తం రూ.321 కోట్ల ప్రాజెక్టులో రూ.114. 53 మేర అవినీతి జరిగిందని తేల్చినట్లు సీఐడీ (CID) పిటిషన్‌లో పేర్కొంది. సెప్టెంబర్-2021లో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని.. ఏ-1గా వేమూరి హరి ప్రసాద్, ఏ-2గా సాంబశివరావు పేర్లను చేర్చినట్లు తెలిపింది. ఇంటర్నెట్, టెలిఫోన్, కేబుల్ టీవీలను తక్కువ ధరకు అందించే నిమిత్తం ఫైబర్ నెట్ ప్రాజెక్టును గత టీడీపీ ప్రభుత్వం తీసుకువచ్చింది.

ఫైబర్ నెట్ కుంభకోణంలో ఏ-25 నిందితుడిగా చంద్రబాబు (Chandrababu) పేరు చేరుస్తూ సీఐడీ మెమో ధాఖలు చేసింది. ఫైబర్ నెట్ కేసులో వేసిన పీటీ వారెంట్‌కి అనుబంధంగా ఈ మెమో జతపర్చింది. సంబంధిత శాఖను తన వద్ద ఉన్నప్పుడే ఫైబర్ నెట్ ప్రాజెక్టులో కుంభకోణం జరిగిందని సీఐడీ ఆరోపించింది. A-1 వేమూరి హరికృష్ణని టెండర్ ప్రాసెస్ కమిటీలో సభ్యుడిగా నియమించేలా అధికారులపై చంద్రబాబు ఒత్తిడి తెచ్చారనే అభియోగం మోపింది. మెస్సర్స్ పేస్ పవర్ అనే సంస్థ ఈ ప్రక్రియను తప్పు పట్టినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొంది. నాసిరకం మెటీరియల్, 80 శాతం ఫైబర్ కేబుల్ పనికి రాకుండా పోయిందని తెలిపింది. ఫేక్ ఇన్‌వాయిస్‌ల ద్వారా నిధుల మళ్లింపు జరిగిందని వెల్లడించింది. ఇప్పటికే స్కిల్ డెవల్‌ప్మెంట్‌తో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అంశంపైనా చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది.

#fibernet-case #bail #chandrababu #tdp #supreme-court
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి