Union Minister Suresh Gopi : ఢిల్లీ (Delhi) లోని రాష్ట్రపతి భవన్ (Rashtrapati Bhavan) లో ఆదివారం ప్రధాని మోదీ (PM Modi) ప్రమాణస్వీకారం చేయగా.. ఆయనతో పాటు మొత్తం 71 మంది మంత్రులుగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో కేరళకు చెందిన నటుడు, బీజేపీ నేత సురేష్ గోపి (Suresh Gopi) కూడా ఉన్నారు. అయితే తాజాగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను త్వరలోనే మంత్రివర్గం నుంచి వైదొలిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి అవ్వాలనే ఆశ తనకు లేదని.. కేరళలో సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. కేంద్రమంత్రి పదవిలో ఉండటం కన్నా ఎంపీగానే ఉండి తాను ఎక్కువగా సాధించగలనని పేర్కొన్నారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఒక్క రోజులోనే ఆయన ఇలా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమవుతోంది.
పూర్తిగా చదవండి..Kerala : ‘నాకు కేంద్ర మంత్రి పదవి వద్దు’.. కేరళ ఎంపీ సంచలన కామెంట్స్
కేరళలో మొదటిసారిగా బీజేపీ నుంచి ఎంపీగా గెలిచిన సురేష్ గోపీ నిన్న కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తనకి మంత్రి పదవిపై ఆశ లేదని, త్వరలోనే ఆ పదవి నుంచి వైదొలిగే అవకాశం ఉందని తాజాగా చెప్పుకొచ్చారు. ఎంపీగా ఉంటూనే కేరళలో సంక్షేమానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.
Translate this News: