Iphone Murder: IPHONE కోసం దారుణ హత్య.. కత్తితో గొంతు కోసి.. రాయితో తలపై కొట్టి కొట్టి

ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు మైనర్ బాలురు ఐఫోన్ కోసం ఏకంగా ఓ యువకుడిని అతి దారుణంగా హతమార్చారు. రీల్స్‌ చేద్దామని చెప్పి షాదాబ్‌ అనే యువకుడిని ఊరి చివరకు తీసుకెళ్లి అతడి గొంతు కోసి, బండ రాయితో తలపై కొట్టి కొట్టి హత్య చేశారు. ఆపై బావిలో పడేశారు.

author-image
By Seetha Ram
New Update
Two miners murdered for iPhone in Uttar Pradesh

Two miners murdered for iPhone in Uttar Pradesh

ప్రస్తుతం రీల్స్ పిచ్చి బాగా ముదిరిపోయింది. ఉదయం నిద్ర లేచిన్నుంచి రాత్రి పడుకునే వరకు యువత రీల్స్‌లోనే మునిగి తేలుతున్నారు. రీల్స్ చేసి సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ క్రమంలోనే దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటిదే ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు మైనర్ బాలురు ఐఫోన్ కోసం ఏకంగా ఓ యువకుడిని అతి దారుణంగా హతమార్చారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read: భారీ వరదలు.. వందల మంది గల్లంతు.. ఒకే కుటుంబంలో 18మంది!

ఐఫోన్ కోసం హత్య

బెంగళూరుకు చెందిన షాదాబ్‌(19) తన మేనమామ మ్యారేజ్‌కు హాజరయ్యేందుకు ఇటీవల బహరాయిచ్‌లోని నాగౌర్‌ గ్రామానికి వెళ్లాడు. ఆ సమయంలోనే ఇద్దరు మైనర్లు రీల్స్‌ చేద్దామని చెప్పి ఆ షాదాబ్‌ను ఊరి చివర ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ అతడి గొంతు కోసి, బండ రాయితో తలపై కొట్టి కొట్టి హత్య చేశారు. 

Also Read: కోల్‌కతా గ్యాంగ్‌ రేప్‌ ఘటన.. వెలుగులోకి సంచలన నిజాలు

ఆపై ఐఫోన్‌ తీసుకుని పరారయ్యారు. అయితే జూన్‌ 21 నుంచి షాదాబ్ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఊరి చివర శిథిలావస్థలో ఉన్న బావిలో షాదాబ్ డెడ్ బాడీ దొరికింది. మృతుడి మెడపై కత్తిపోట్లు, తలపై తీవ్ర గాయాలు ఉండటాన్ని గుర్తించి అనుమానాస్పద మృతిగా కేసు ఫైల్ చేశారు. 

Also Read :  జపాన్‌లో ‘ట్విటర్‌ కిల్లర్‌’ కు ఉరి

మృతిడి ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా అదే గ్రామంలోని 14 ఏళ్లు, 16 ఏళ్ల గల ఇద్దరు మైనర్‌ బాలురను అరెస్టు చేశారు. ఆపై వారిని విచారించగా.. నేరం చేసినట్లు అంగీకరించారు. వీరితో పాటు హత్య చేసిన ఆయుధాలను దాచిన  మరో బాలుడిని కూడా అరెస్టు చేశారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు