Instagram Reels: రీల్స్ పిచ్చి.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అమ్మాయిలు మృతి

ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం యమునా నదిలోకి దిగిన ఆరుగురు యువతులు మృతి చెందారు. ఒకరిని రక్షించేందుకు ప్రయత్నించిన ఐదుగురు కూడా కొట్టుకుపోయారు. వీరంతా ఒక్కే కుటుంబానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి.

New Update
Uttar pradesh Six girls die after diving into Yamuna river for Instagram reels

Uttar pradesh Six girls die after diving into Yamuna river for Instagram reels

రీల్స్ పిచ్చి రోజు రోజుకూ పెరిగిపోతుంది. యువతీ యువకులు గంటల తరబడి రీల్స్ మోజులో పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా అలాంటిదే జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు యువతులు రీల్స్ కోసం నది వద్దకు వెళ్లారు. అక్కడ అందమైన లోకేషన్స్‌ను క్యాప్చర్ చేసేందుకు నదిలోకి దిగారు. ప్రమాదవశాత్తు నీటిలో దిగి ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు

ఉత్తర ప్రదేశ్‌లోని నగ్లాస్వామి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు యువతులు రీల్స్ చేయడానికి యమునా నదికి వెళ్లారు. అక్కడ అందమైన లోకేషన్ కనిపించడంతో వాటిని క్యాప్చర్ చేయడానికి నదిలోకి దిగారు. అప్పుడే ఒక యువతి నీటిలో మునిగిపోయింది. అది చూసిన మిగతా ఐదుగురు ఆమెను కాపాడటానికి నదిలోకి దిగారు. 

Also Read: ఫలించిన 18 ఏళ్ళ నిరీక్షణ..మిన్నంటిన ఆర్సీబీ సంబరాలు

ఆమెను కాపాడటానికి ఎంతో ప్రయత్నించారు. ఈ క్రమంలో నదిలో దిగిన వారంత నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం గాలింపు చర్యలు చేపట్టారు. అందులో నాలుగు డెడ్ బాడీలను కనుగొని బయటకు తీశారు. మిగిలిన ఇద్దరి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో వారిని హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ ఇద్దరి యువతులు మరణించారు. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. 

Advertisment
Advertisment
తాజా కథనాలు