/rtv/media/media_files/2025/06/26/travel-bus-accident-at-kurnool-domalapenta-2025-06-26-09-25-19.jpeg)
travel bus accident at kurnool domalapenta
Ap News: కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. బస్సు బ్రేకులు ఫెయిల్ అవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలవగా.. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ హానీ జరగలేదు. ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేవుడి దర్శనం కోసం వెళ్తుండగా ఇలాంటి ప్రమాదం ఎదురవడంతో బస్సులోని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.
ఇది కూడా చూడండి: Surveyor Tejeshwar Murder: పోలీసుల అదుపులో బ్యాంక్ మేనేజర్.. వెలుగులోకి సంచలన విషయాలు
కర్నూలు,దోమలపెంట సమీపంలో ప్రవేట్ ట్రావెల్ బస్సు బోల్తా
— RTV (@RTVnewsnetwork) June 26, 2025
శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారి దోమలపెంట వద్ద అదుపుతప్పి బోల్తా పడిన బస్సు
హైదరాబాద్ నుంచి మల్లన్న దర్శనార్థం శ్రీశైలం వస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు
బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగిందని సమాచారం
ఈ ఘటనలో… pic.twitter.com/4OWaVxP4rP
మరో ప్రమాదం
ఇదిలా ఉంటే రోజు ఉదయం తెలంగాణలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎస్సై, కానిస్టేబుల్ అక్కడిక్కడే మృతి చెందారు. వీరిద్దరూ ప్రయాణిస్తున్న కారు సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ దుర్గాపురం వద్ద గుర్తుతెలియని ఓ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో ఇద్దరు స్పాట్ లో మరణించారు. వీరిని ఏపీలోని కోనసీమ జిల్లా ఆలమూరు స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై అశోక్, కానిస్టేబుల్ వీరస్వామిగా గుర్తించారు. పని నిమిత్తం హైదరాబాద్కు బయలుదేరగా.. మార్గంమధ్యలో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read: Chiranjeevi: శేఖర్ కమ్ముల చేయి వేయగానే చిరంజీవి ఎలా చేశారో చూడండి! వీడియో వైరల్