/rtv/media/media_files/2025/04/13/X9m6ezRFc6iX3RGHbk2m.jpg)
Accident
తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్లోని దుర్గాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని ఓ వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొనడంతో ఎస్సై, కానిస్టేబుల్ మృతి చెందారు. వీరు ఏపీలోని కోనసీమ జిల్లా ఆలమూరు స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై అశోక్, కానిస్టేబుల్ వీరస్వామిగా గుర్తించారు. పని నిమిత్తం హైదరాబాద్కు బయలుదేరగా.. మార్గంమధ్యలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలు కావడంతో స్థానికులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చూడండి: Chhattisgarh : మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. నలుగురు కీలక నేతల అరెస్ట్
ఇటీవల రంగారెడ్డిలో..
ఇదిలా ఉండగా..రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన కారు స్కూటర్ను ఢీ కొట్టడంతో గాల్లోకి ఎగిరిపడింది. దీంతో ఆ స్కూటీపై ఉన్న ముగ్గురిలో ఒక మహిళ మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు కావడంతో పోలీసులు వెంటనే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చూడండి: Sexual Harassment : ప్లీజ్ వీడియో కాల్ లో మాట్లాడు.. ఓ చీఫ్ ఇంజినీర్ ఛీప్ ప్రవర్తన..సీతక్క ఫైర్
ఇదిలా ఉండగా.. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలోని సికంద్రా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన జరిగింది. ఖర్వాయి గ్రామంలో జరిగిన బరాత్తో నృత్యం చేస్తున్న మహిళలు, పిల్లలను అదుపు తప్పిన ఎకో వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దాదాపు ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే సీసీటీవీ కెమెరాలో దీనికి సంబంధించిన వీడియో రికార్డు అయ్యింది. దీంతో పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చూడండి: Maargan: మొదటి ఆరు నిమిషాలతో భయపెడుతున్న ఆంటోనీ 'మార్గన్'! వీడియో చూశారా?