Diamond heist: నగరం నడిబొడ్డున రూ.20 కోట్ల వజ్రాల దోపిడీ.. పట్టించిన టోల్ ప్లాజా!

తమిళనాడులో భారీ దొంగతనం జరిగింది. వడపళనిలో రూ.20 కోట్ల విలువైన వజ్రాలను నలుగురు వ్యక్తుల ముఠా దోచుకెళ్లింది. వ్యాపారి చంద్రశేఖర్ మరో వ్యాపారవేత్తకు ఇచ్చేందుకు వెళ్లగా ఈ ఘటన జరిగింది. శివకాశి టోల్ ప్లాజా వద్ద పోలీసులు నిందితులను పట్టుకున్నారు.  

New Update
daimonds

Tamil Nadu 20 crores Diamond robbery

Diamond heist: తమిళనాడులో భారీ దొంగతనం జరిగింది. వడపళనిలో రూ.20 కోట్ల విలువైన వజ్రాలను నలుగురు వ్యక్తుల ముఠా దోచుకెళ్లింది. వ్యాపారి చంద్రశేఖర్ మరో వ్యాపారవేత్తకు ఇచ్చేందుకు వెళ్లగా ఈ ఘటన జరిగింది. శివకాశి టోల్ ప్లాజా వద్ద పోలీసులు నిందితులను పట్టుకున్నారు.  

డెలివరీ చేస్తుండగా అటాక్.. 

ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నా నగర్‌కు చెందిన వజ్రా భరణాల వ్యాపారి చంద్రశేఖర్ మరో వ్యాపారవేత్తకు రూ.20 కోట్ల విలువైన వజ్రాల బల్క్ ఆర్డర్‌ను డెలివరీ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇందులో భాగంగానే వడపళనిలోని ఒక హోటల్‌లో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన దుండగులు.. అతన్ని ఫాలో అయ్యారు. ఆదివారం హోటల్‌కు చేరుకోగానే చంద్రశేఖర్‌పై నలుగురు వ్యక్తులు దాడి చేసి అతన్ని బంధించి, కారులో వజ్రాలతో పారిపోయారు. 

Also Read :  మెగాస్టార్ హీరోయిన్ ఫస్ట్ లుక్.. 'అవని' గా త్రిష సందడి !

చంద్రశేఖర్ వెంటనే  పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హోటల్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా వారి కదలికలను గుర్తించినట్లు తెలిపారు. రెండు ప్రత్యేక బృందాలను ఏర్పడి గాలింపు కొనసాగించాం. ఈ దొంగల ముఠాను శివకాశి సమీపంలో టోల్ ప్లాజా దాటడానికి ప్రయత్నిస్తుండగా అరెస్టు చేశాం. నిందితులను లండన్ రాజన్, అతని సహచరుడు, మరో ఇద్దరు సహాయకులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. తదుపరి విచారణ కోసం చెన్నై కోర్టుకు తరలించనున్నట్లు వెల్లడించారు.

Also Read: వీడు భర్త కాదు బండరాయి.. భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కు తినేశాడు వెధవ!

chennai | daimonds | robbery | today telugu news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు