Son kill Father: కారులో ఫ్రంట్ సీట్ కోసం తండ్రిని కాల్చి చంపిన కొడుకు!

ఢిల్లీలోని తిమార్‌పూర్ ప్రాంతంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కారు ముందు సీట్లో కూర్చోవడంపై జరిగిన గొడవలో దీపక్ అనే యువకుడు తన తండ్రి, CISFలో రిటైర్డ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ సురేంద్ర సింగ్‌ను కాల్చి చంపాడు. పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

New Update
Son kills father for tempo front seat in delhi

Son kills father for tempo front seat in delhi

ఢిల్లీలోని తిమార్‌పూర్ ప్రాంతంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కారు ముందు సీట్లో కూర్చోవడంపై జరిగిన గొడవలో ఓ యువకుడు తన కన్న తండ్రిని కాల్చి చంపాడు. మృతుడు CISFలో రిటైర్డ్ సబ్-ఇన్‌స్పెక్టర్ అని తెలిసింది. ఈ ఘటన గురువారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో తిమార్‌పూర్‌లోని ఎంఎస్ బ్లాక్ సమీపంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read: భారీ వరదలు.. వందల మంది గల్లంతు.. ఒకే కుటుంబంలో 18మంది!

ఫ్రంట్ సీటు కోసం చంపేశాడు

60 ఏళ్ల సురేంద్ర సింగ్ ఆరు నెలల క్రితం CISF నుండి పదవీ విరమణ పొందాడు. దీంతో ఇప్పుడు ఆయన తన కుటుంబంతో ఉత్తరాఖండ్‌లోని తమ స్వగ్రామానికి మారడానికి సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగానే వారు ఒక టెంపోను అద్దెకు తీసుకుని తమ వస్తువులను లోడ్ చేసుకున్నారు. 

Also Read: కోల్‌కతా గ్యాంగ్‌ రేప్‌ ఘటన.. వెలుగులోకి సంచలన నిజాలు

ఆ సమయంలోనే ముందు సీట్లో ఎవరు కూర్చోవాలనే దానిపై తండ్రి సురేంద్రకు కొడుకు దీపక్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. అలా వారి గొడవ మరింత పెద్దదిగా మారింది. దీంతో కోపగ్రస్తుడైన కొడుకు దీపక్.. తన తండ్రి లైసెన్స్ పొందిన తుపాకీని తీసుకుని కాల్పులు జరిపాడు. 

Also Read :  జపాన్‌లో ‘ట్విటర్‌ కిల్లర్‌’ కు ఉరి

ఈ తుపాకీ శబ్దం విని పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అనంతరం దీపక్ చేతిలో ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకుని అతడిని అరెస్టు చేశారు. ఆపై సురేంద్ర సింగ్‌ను హాస్పిటల్‌కు తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు