Simhachalam Temple Tragedy: సింహాచలం గోడకూలిన ఘటన.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!

సింహాచలం చందనోత్సవంలో గోడకూలి 8 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, అచ్చెన్నాయుడు స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

New Update
cm and Kinjarapu Atchannaidu

cm and Kinjarapu Atchannaidu

Simhachalam Temple Tragedy: విశాఖ జిల్లా(Visakhapatnam District) సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో గోడ కూలి క్యూలైన్‌లో ఉన్నవారిపై పడింది. దీంతో స్పాట్‌లోనే ఎనిమిది మంది మృతి చెందారు. అయితే ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) స్పందించారు. ఈ ఘటన తనని ఎంతగానో కలచి వేసిందన్నారు. ఈ విషాద ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే విశాఖ జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారికి వెంటనే మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు సీఎం చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

ఇది కూడా చూడండి: Jammu and Kashmir: లోయలో పడిపోయిన CRPF జవాన్ల వాహనం

ఇది కూడా చూడండి: Akshaya Tritiya 2025 నేడు అక్షయ తృతీయ.. బీరువాలో ఈ ఒక్కటి ఉంచితే డబ్బులే డబ్బులు

మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు..

ఇది కూడా చూడండి: DC VS KKR: డూ ఆర్ డై మ్యాచ్ లో ఢిల్లీ ఓటమి..14 పరుగుల తేడాతో కోలకత్తా విజయం

కింజరాపు అచ్చెన్నాయుడు(Atchannaidu) కూడా..

ఈ ఘటనపై కింజరాపు అచ్చెన్నాయుడు కూడా స్పందించారు. సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రమాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. స్వామి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడం తీవ్ర మనోవేదనకు గురిచేసిందన్నారు. ప్రమాద ఘటనపై జిల్లా అధికారులతో మాట్లాడారని.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించినట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు