/rtv/media/media_files/2025/04/30/ur7IAkXE9imboh2OywR4.jpg)
cm and Kinjarapu Atchannaidu
Simhachalam Temple Tragedy: విశాఖ జిల్లా(Visakhapatnam District) సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో గోడ కూలి క్యూలైన్లో ఉన్నవారిపై పడింది. దీంతో స్పాట్లోనే ఎనిమిది మంది మృతి చెందారు. అయితే ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) స్పందించారు. ఈ ఘటన తనని ఎంతగానో కలచి వేసిందన్నారు. ఈ విషాద ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే విశాఖ జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారికి వెంటనే మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు సీఎం చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
ఇది కూడా చూడండి: Jammu and Kashmir: లోయలో పడిపోయిన CRPF జవాన్ల వాహనం
శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందడం నన్ను కలచి వేసింది. భారీ వర్షాల కారణంగా గోడ కూలడం తో జరిగిన ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అక్కడి పరిస్థితి పై జిల్లా కలెక్టర్, ఎస్పీ తో మాట్లాడాను. గాయపడిన వారికి చికిత్స…
— N Chandrababu Naidu (@ncbn) April 30, 2025
ఇది కూడా చూడండి: Akshaya Tritiya 2025 నేడు అక్షయ తృతీయ.. బీరువాలో ఈ ఒక్కటి ఉంచితే డబ్బులే డబ్బులు
మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు..
మృతులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్న....
— I & PR Andhra Pradesh (@IPR_AP) April 30, 2025
గాయపడిన వారికీ తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశాము...
శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో, సింహాచలంలోని ఘాట్ రోడ్డులో జరిగిన దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను.
మంగళవారం కురిసిన భారీ వర్షానికి
ఇది కూడా చూడండి: DC VS KKR: డూ ఆర్ డై మ్యాచ్ లో ఢిల్లీ ఓటమి..14 పరుగుల తేడాతో కోలకత్తా విజయం
కింజరాపు అచ్చెన్నాయుడు(Atchannaidu) కూడా..
ఈ ఘటనపై కింజరాపు అచ్చెన్నాయుడు కూడా స్పందించారు. సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రమాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. స్వామి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడం తీవ్ర మనోవేదనకు గురిచేసిందన్నారు. ప్రమాద ఘటనపై జిల్లా అధికారులతో మాట్లాడారని.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించినట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు.
సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రమాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. స్వామి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడం తీవ్ర మనోవేదనకు గురిచేసింది. ప్రమాద ఘటనపై జిల్లా అధికారులతో మాట్లాడాను. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. క్షతగాత్రులకు…
— Kinjarapu Atchannaidu (@katchannaidu) April 30, 2025