/rtv/media/media_files/2025/06/28/law-college-gang-rape-2025-06-28-11-14-31.jpg)
వెస్ట్ బెంగాల్ కోల్కతాలోని లా కాలేజీ విద్యార్థిని సామూహిక అత్యాచార ఘనటలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనకు బాయ్ఫ్రెండ్ ఉన్నాడని, కాళ్లు పట్టుకుంటానని వేడుకున్నా ఆ కీచకుడు ఆమెను వదల్లేదని బాధితురాలు పోలీసులు ఫిర్యాదులో పేర్కొంది. ఆమెపై లైంగిక దాడిని వీడియో రికార్డ్ చేసి తనను బ్లాక్ మెయిల్ చేసి మౌనంగా ఉంచారని ఆ మహిళ తెలిపింది. సహకరించకపోతే ఈ వీడియోలను అందరికీ చూపిస్తానని నిందితుడు బెదిరించాడు. మోనోజిత్ మిశ్రా మరో ఇద్దరు జైబ్ అహ్మద్ (19), ప్రమిత్ ముఖర్జీ (20)లతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె పోలీసులుకు తెలిపింది. బాధితురాలి బాయ్ఫ్రెండ్ను చంపేస్తానని, తల్లిదండ్రులను తప్పుడు కేసులో ఇరికిస్తానని మిశ్రా బెదిరించాడు.
#Kolkatalawcollege : A law student was gang raped inside a South Kolkata Law College. The incident allegedly happened on 25th June.
— TIger NS (@TIgerNS3) June 27, 2025
Main accused is 30 year old former student Manojit Mishra who ihas connections with TMC.
19 years old Zaib Ahmed and 20 yr old Pramit Mukherjee… pic.twitter.com/LVH4B3J5j1
ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా యువతిని పెళ్లి చేసుకుంటానని లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలుస్తోంది. కాలేజ్ సెక్యూరిటీ గదిలో 24 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగిందని బాధితురాలు చెబుతోంది. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులను 5 రోజుల పోలీసు కస్టడీకి తరలించారు. మోనోజిత్ మిశ్రా తృణమూల్ కాంగ్రెస్ ఛత్ర పరిషత్ ప్రధాన కార్యదర్శి. అతను ఆమెను వివాహం చేసుకోవాలని బలవంతం చేశాడని యువతి పోలీసుల ఫిర్యాదులో పేర్కొంది.
జూన్ 25న రాత్రి 7.30 గంటల నుండి 10.50 గంటల మధ్య కళాశాల ఆవరణలో ఈ సంఘటన జరిగిందని తెలుస్తోంది. పోలీసులు ప్రాణాలతో బయటపడిన వ్యక్తికి ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించి, ఫోరెన్సిక్ పరీక్ష కోసం సంఘటన స్థలాన్ని భద్రపరిచారు. కస్బా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత, ఈ కేసుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు.