/rtv/media/media_files/2025/04/25/Se23cwuJDuP7pk582Ps2.jpg)
Asif Sheikh
పహల్గామ్ ఉగ్రవాద దాడిలో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదుల హస్తం ఉందని అనుమానిస్తున్న విషయం తెలిసిందే. అయితే జమ్మూ కశ్మీర్ పోలీసులు ఉగ్రవాదులు అయిన ఆసిఫ్ ఫౌజీ అలియాస్ ఆసిఫ్ షేక్, ఆదిల్ థోకర్ అలియాస్ ఆదిల్ గురి అనే ఇద్దరు ఇళ్లల్లో సోదాలు జరపడానికి వెళ్లారు.
ఇది కూడా చూడండి: Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?
ఇంట్లో తనిఖీలు చేస్తున్న సమయంలో అమర్చిన పేలుడు పదార్థాలు యాక్టివేట్ అయినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులు బయటకు రాగా.. పేలుళ్లు సంభవించాయి. అయితే భద్రతా దళాలు తమ ఇంటిని వెతుక్కుని వస్తాయని ఉగ్రవాది ఆసీఫ్ ఫౌజీ ముందే గుర్తించి ట్రాప్ పెట్టాడు.
The house of Lashkar-e-Taiba terrorist Asif Sheikh in Tral, South Kashmir, was destroyed after a suspicious box with wires was found in Moghama during a search operation linked to the Pahalgam attack. pic.twitter.com/xkmMLTI4Mx
— Angry Saffron (@AngrySaffron) April 25, 2025
హిందూ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని..
జమ్మూకశ్మీర్ పహల్గామ్లో ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. స్టీల్ టిప్డ్ బుల్లెట్లు, AK-47 రైఫిళ్లు, బాడీ కెమెరాలు ధరించిన నలుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదుల బృందం హిందూ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండి జమ్మూ కాశ్మీర్ సందర్శించడానికి వెళ్లిన పర్యాటకులు మృతి చెందారు. అయితే ఈ ఉగ్రవాదులలో ఇద్దరు స్థానికులు కూడా ఉన్నారు. బిజ్బెహారా నివాసి ఆదిల్ హుస్సేన్ థోకర్, త్రాల్ నివాసి ఆసిఫ్ షేక్గా గుర్తించారు. వీరిలో ఒకరు అయిన ఆసిఫ్ షేక్ ఇంటిని ఆర్మీ బలగాలు ఐఈడీతో పేల్చాయి.
ఇది కూడా చూడండి: PM Modi: వారిని మట్టిలో కలిపేస్తాం.. ఇక యుద్ధమే: మోదీ సంచలన ప్రకటన
ఆదిల్ 2018లో అట్టారి-వాఘా సరిహద్దు ద్వారా చట్టబద్ధంగా పాకిస్తాన్కు వెళ్లాడు. అక్కడ ఉగ్రవాద శిబిరంలో శిక్షణ పొంది తిరిగి.. జమ్మూ కాశ్మీర్కు తిరిగి వచ్చాడు. పహల్గామ్ దాడిని ప్రత్యక్షంగా చూసిన కొందరు ఉగ్రవాదులు తమలో తాము పష్టున్ భాషలో మాట్లాడుకుంటున్నారని తెలిపారు. అయితే ఉగ్రవాదులందరూ పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన వారు.
RETALIATION STARTS 🔥
— Navaladi Thambiraj (@Navaladi678) April 25, 2025
The house of terrorist Asif Sheikh was blown up by the Indian Army.#PahalgamTerroristAttack | #Pahalgam pic.twitter.com/bDIg1Xa1Gx
పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న ముగ్గురు టెర్రరిస్టుల ఊహా చిత్రాలను దర్యాప్తు బృందాలు బయటకు విడుదల చేశాయి. వీరిలో ఆసిఫ్ ఫౌజి, సులేమాన్ షా, అబు తాలా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే వీరికి కోడ్నేమ్లు కూడా ఉన్నాయి. వీరితో పాటు మరో ఆదిల్ థోకర్ అనే ఉగ్రవాదికి కూడా సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లు జమ్మూకశ్మీర్ కేంద్రంగా పనిచేసే ది రెసిస్టెన్స్ ఫ్రంట్లో సభ్యులుగా ఉంటున్నారు.
ఇది కూడా చూడండి: Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?
Modi Govt means zero tolerance for terrorism!
— Dr.B.L.Sreenivas Solanky (@SolankySrinivas) April 25, 2025
The house of terrorist Asif Sheikh, linked to the #Pahalgam attack, has been blown up in J&K's Tral.
Strong message — those who shelter terror will face the consequences! pic.twitter.com/r7RXOnS2qA
ఇది కూడా చూడండి: New Smartphone: శాంసంగ్ M56 5G ఫస్ట్ సేల్ షురూ.. భారీ డిస్కౌంట్- ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!