Crime News: తెలంగాణలో మరో దారుణం జరిగింది. కామాంధుల చేతిలో బాలిక బలైంది. ఆమె తల్లిదండ్రులు అనుకోకుండా రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగా ఇంటి వద్దే ఉన్న చిన్నారిపై ఇద్దరు యువకులు దారుణానికి పాల్పడ్డారు. ఒంటరిగా ఉన్న అమ్మాయిపై లైంగిక దాడి చేశారు. ఒకరి తర్వాత ఒకరు విచక్షణ రహితంగా కాంమవాంఛ తీర్చుకోగా చివరికి బాలిక అరుపులతో స్థానికలు నిందితులను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకోగా ఎస్సై చైతన్యరెడ్డి చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒంటరిగా ఉండటం గమనించి.. ఈ మేరకు బాధితురాలైన బాలిక (16) తల్లిదండ్రులు మరమరాలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తారు. ఈ క్రమంలోనే వర్గల్ మండలంలోని అనంతగిరిపల్లికి శుక్రవారం వెళ్లారు. అయితే అక్కడే రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. దీంతో బాలిక చిన్నాన్న, అన్న కలిసి వారిని తూప్రాన్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడి నుంచి సికింద్రాబాద్ గాంధీకి తరలించారు. అయితే వారిని చూసేందుకు వెళ్లిన బాలిక చిన్నమ్మను అదే గ్రామానికి చెందిన లకావత్ ప్రవీణ్ బైక్ పై గాంధీ ఆసుపత్రిలో దింపి వచ్చాడు. ఈ క్రమంలోనే బాలిక ఇంటి వద్ద ఒంటరిగా ఉండటం గమనించాడు. సాయంత్రం వరకు ఆమెను ఫాలో అయిన ప్రవీణ్.. మాసాయిపేట మండలం చెట్లతిమ్మాయిపల్లికి చెందిన రాజును పిలుచుకున్నాడు. అదే రాత్రి గుడిసెలో నిద్రపోతున్న ఆమెపై అగాయిత్యానికి పాల్పడ్డారు. ఇది కూడా చదవండి: Pawan; సినిమా ఇండస్ట్రీకి పవన్ కీలక సూచన.. సంచలన లేఖ విడుదల! అయితే అర్ధరాత్రి బాలిక అరుపులు విన్న చిన్నాన్న గుడిసె తలుపు తీసేందుకు ప్రయత్నించగా రాలేదు. దీంతో ఇరుగుపొరుగును పిలిచి తలుపులు తెరవగా అసలు విషయం బయటపడింది. నిందితులను పట్టుకుని దేహశుద్ది చేసి చేగుంట పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి బాలికను చికిత్స కోసం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తన్నామని ఎస్సై చైతన్యరెడ్డి చెప్పారు. ఇది కూడా చదవండి: BCCI: రోహిత్కు బీసీసీఐ బిగ్ షాక్.. హింట్ ఇచ్చేసిన సెలెక్టర్లు!