Honeymoon Murder Case: అక్కడ పూజలు చేశాకే ఫస్ట్ నైట్.. హనీమూన్ మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు

మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. కామాఖ్య ఆలయంలో పూజలు పూర్తి చేశాకే తనని తాకనిస్తానంటూ సోనమ్ భర్తకు షరతులు చెప్పింది. హనీమూన్ పేరుతో ట్రిప్ ప్లాన్ చేసి సోనమ్ భర్తని హత్య చేసింది.

New Update
Meghalaya Honeymoon Murder Case

Meghalaya Honeymoon Murder Case

మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. పోలీసులు ఇంకాస్త లోతుగా విచారణ చేసినా కొద్ది కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. మే 10న సోనమ్, రఘవంశీల పెళ్లి జరిగింది. అంతకు ముందు నుంచే సోనమ్‌, రాజ్‌ కుశ్వాహా అనే యువకుడితో పేమలో ఉంది. అతడు సోనమ్ తండ్రి కంపెనీలో పని ఉద్యోగి.. బయలకు అతడితో స్నేహంగా ఉంటూ లోపల ప్రమేమాణం సాగించింది. నేరుగా అతన్ని పెళ్లి చేసుకుంటా అంటే ఆమె తండ్రి ఒప్పుకోడని తెలిసిన సోనమ్ పెద్ద ప్లాన్ వేసింది. రాజ్‌ కుశ్వాహాతో మొదటి పెళ్లికి తండ్రి ఒప్పుకోడు.. కానీ రెండో పెళ్లి అయితే కచ్చితంగా ఇంట్లో అంగీకరిస్తారని భావించింది.

Also Read: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. వెయిటింగ్ లిస్ట్‌పై కీలక నిర్ణయం!

Honeymoon Murder Case

ఇందులో భాగంగానే రఘువంశీని పెళ్లి చేసుకుంది. అతన్ని చంపి.. తర్వాత రాజ్‌ కుశ్వాహాని రెండో పెళ్లి చేసుకోవాలని స్కెచ్ వేసింది. పెళ్లి అయ్యాకు కూడా రఘు వంశీని సోనమ్ తాకనివ్వలేదు. కామాఖ్య ఆలయంలో పూజలు పూర్తి చేశాకే తనని తాకనిస్తానంటూ సోనమ్ భర్తకు షరతులు చెప్పింది. మే 10న పెళ్లి అయినా.. ఫస్ట్ నైట్‌కు నో చెప్పింది. హనీమూన్ పేరుతో ట్రిప్ ప్లాన్ చేసి కొండపైకి తీసుకెళ్లి అక్కడ నుంచి తోసేసి భర్త రఘవంశీని హత్య చేసింది. ఆమె కూడా కొన్ని రోజులు అజ్ఞాతంలోకి కిడ్నాక్ డ్రామా ఆడింది. కొండమీద నుంచి కిందకి తోశాక భర్తను చంపడానికి నలుగురి సుఫారీ ఇచ్చింది. జితేంద్ర రఘువంశీ అనే వ్యక్తి యూపీఐ ఖాతాను వినియోగించి సుపారీ గ్యాంగ్‌కు సోనమ్‌ డబ్బులు చెల్లించింది. జితేంద్ర తమ కజిన్‌ అని పేర్కొన్న సోనమ్ సోదరుడు గోవింద్‌ పోలీసులకు తెలిపాడు. 

Also Read: Thammudu Trailer: అక్క, తమ్ముడు ఎమోషన్ తో 'తమ్ముడు' ట్రైలర్ అదిరింది! ఇక్కడ చూడండి

అతని బావను తన చెల్లె హత్య చేయించిందని, నేరం రుజువైతే తన చెల్లిని ఉరి తీయాలని సోనమ్ అన్న గోవింద్ డిమాండ్ చేశాడు. దట్టమైన అడవులోని నాంగ్రియాట్ ప్రాంతంలోని కామాఖ్య ఆలయం దగ్గరికి తీసుకెళ్లాలని సోనమ్ భర్తను బలవంతం పెట్టింది. తొలుత నాంగ్రియాట్ ప్రాంతానికి వెళ్లగా అక్కడ పర్యాటకులు ఎక్కువగా ఉండటంతో.. వెయిసావ్రింగ్ జలపాతం వద్దకు తీసుకెళ్లి అక్కడ కిరాయి హంతకులతో హత్య చేయించింది.

Also Read: 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. !

Also Read: ఈ నెలలోనే అమెరికా, భారత్ మధ్యంతర డీల్..500 బిలియన్ డాలర్ల వాణిజ్య ఒప్పందం

 

latest-telugu-news | Meghalaya Honeymoon Murder Case | Honeymoon Murder Case | Sonam | Raja Raghuvanshi

Advertisment
Advertisment
తాజా కథనాలు