/rtv/media/media_files/2025/05/05/tVqfq7DNJCXRwb73OVfU.jpg)
కేరళలో రేబిస్ వ్యాధి కలకలం రేపుతోంది. కేరళకు చెందిన ఏడేళ్ల బాలిక యాంటీ-రేబిస్ టీకాలు తీసుకున్నప్పటికీ రేబిస్ ఇన్ఫెక్షన్కు గురై చనిపోయింది. ఇది ఈ నెలలోనే మూడో కేసు కావడం గమనార్హం. కొల్లం జిల్లాలోని పఠానపురానికి చెందిన నియా ఫైసల్ అనే చిన్నారి తిరువనంతపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలోని SAT (స్పెషలిస్ట్ అనస్థీషియా ట్రీట్మెంట్) చికిత్స పొందుతూ మరణించింది. కాగా ఏప్రిల్ 8న తన ఇంటి బయట ఆడుకుంటున్నప్పుడు నియాపై ఓ వీధికుక్క దాడి చేసింది.
🚨 🚨 #BreakingNews Kerala girl dies of rabies despite vaccine, third child death in a month https://t.co/u9Xp72pbYV
— Instant News ™ (@InstaBharat) May 5, 2025
Kerala girl dies of rabies despite vaccine third child death in a month#TrendingNews #BigBreaking
Also read : India vs Pakistan : భారత్ను రెచ్చ గొట్టడమే లక్ష్యంగా.. పాక్ మరోసారి క్షిపణి ప్రయోగం?
Also read : ఖమ్మంలో డిజిటల్ అరెస్ట్ కలకలం.. ఒక్క కాల్ తో రూ.26 లక్షలు ఎలా కొట్టేశారంటే?
ఆసుపత్రి నుండి తరలిస్తుండగా
దీంతో వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు, అక్కడ కొన్ని వారాలలో ఆమెకు మూడు డోసుల యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చారు. అయితే ఆ తరువాత ఆమెకు జ్వరం రాగా రేబిస్ సోకినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. దీంతో వెంటనే ఆమెను తదుపరి చికిత్స కోసం తిరువనంతపురంలోని SAT ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి కన్నుమూసింది. సోమవారం ఉదయం నియా మృతదేహాన్ని ఆసుపత్రి నుండి తరలిస్తుండగా, ఆమె తల్లి విలపిస్తూ మరే బిడ్డకు ఇలాంటి విషాదం జరగకూడదని తెలిపింది.
Also Read : PM Modi: ఆర్మీ సూట్లో ప్రధాని మోదీ.. ఉగ్రవాదంపై సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్
Also read : TGSRTC : బస్సు భవన్ వద్ద ఉద్రిక్తత...ఒక్కసారిగా వందలాది మంది కార్మికులు..
కాగా అంతకుముందు పుల్గాడ్, మలప్పురంలో ఇద్దరు చిన్నారులు రేబిస్ ఇన్ఫెక్షన్కు గురై చనిపోయారు. రాష్ట్ర ఆసుపత్రులలో వ్యాక్సిన్ల నాణ్యతను నిర్ధారించిన తర్వాతే వాటిని అందజేస్తామని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఇటీవల అన్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం, గత ఐదు సంవత్సరాలలో టీకాలు వేయించుకున్నప్పటికీ 21 మంది రేబిస్ వ్యాధితో మరణించారు.
kerala | rabies vaccinations | dog attacks | telugu-news