/rtv/media/media_files/2025/05/03/JkbabUj4FM2USKSxQEav.jpg)
full-battles
పాపం సరదాగా వేసుకున్న పందెం ఓ మనిషి ప్రాణాలు తీసింది. ఓ యువకుడు వాటర్ లేకుండా ఐదు ఫుల్ బాటిళ్లు తాగుతానని పందెం కట్టి చివరకు ఆసుపత్రి పాలై కన్నుమూశాడు. ఈ ఘటన కర్ణాటకలోని కోలార్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 21 ఏళ్ల కార్తీక్ కు పెళ్లై అయింది. ప్రస్తుతం భార్య గర్భవతి కూడా...ఆమెను పుట్టింటికి పంపించిన కార్తీక్.. మద్యానికి, జూదానికి బానిసయ్యాడు. సరదాగా.. తన స్నేహితులతో పందెం వేశాడు.
Also read : బద్మాష్ బంగ్లాదేశ్.. పాక్ పక్కన చేరి ఇండియానే ఆక్రమించుకోవాలని ప్లాన్..!
ఫుల్ బాటిళ్లు తాగుతానని సవాల్
చుక్క నీరు లేకుండా ఐదు ఫుల్ బాటిళ్లు తాగుతానని సవాల్ చేశాడు. అలా తాగలేవని.. అలా తాగితే రూ.10,000 రూపాయలు ఇస్తానని వెంకట రెడ్డి అనే స్నేహితుడు కార్తీక్ కు ఆఫర్ చేశాడు. దీంతో అలా అతిగా తాగిన కార్తీక్ చివరకు ఆసుపత్రిపాలై చనిపోయాడు. కార్తీక్ అతిగా మద్యం సేవించేందుకు ప్రేరేపించినందుకు వెంకట రెడ్డి, సుబ్రమణితోపాటుగా మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read : TS: 600 చ.అడుగులు మించకూడదు..ఇందిరమ్మ ఇళ్ళ కీలక అప్డేట్..
వెంకట రెడ్డి, సుబ్రమణిలను అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. అతిచిన్న వయసులో భర్తను కోల్పోయిన కార్తీక్ భార్య పాపం ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయింది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. కాగా ప్రతీ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 26 లక్షల మంది మద్యం తాగడం వల్ల మృత్యువాత పడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ఈ సంఖ్య ప్రతి ఏడాది సంభవించే మరణాల్లో 4.7 శాతం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.
Also read : Flights: మూలిగే నక్క మీద తాటి పండు..పాకిస్తాన్ ను వద్దంటున్న విదేశాలు
Also read : Uttar Pradesh : 21 ఏళ్లకే 12పెళ్లిళ్లు .. పెళ్లి చేసుకున్న గంటకే జంప్!
karnataka | alcohol | drinking bet | telugu-news