Flights: మూలిగే నక్క మీద తాటి పండు..పాకిస్తాన్ ను వద్దంటున్న విదేశాలు

భారత్, పాకిస్తాన్ ల ఉద్రిక్తత సెగ..మిగతా దేశాలకూ పాకింది. ప్రస్తుతం ఇరు దేశాల తమ గగనతలాల మీద రెస్ట్రిక్షన్స్ విధించుకున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ గగనతలం వద్దు..భారత్ దే కావాలని విదేశీ విమానయాన సంస్థలు అంటున్నాయి. 

New Update
flight

flight

పాక్ గగనతలాన్ని స్వచ్చందంగా నిరాకరిస్తున్నాయి బ్రిటిష్‌, స్విడ్జర్లాండ్‌, ఫ్రాన్స్‌, ఇటలీ, పోలండ్‌ దేశాలకు చెందిన పలు విమానయాన సంస్థలు. భారత్, పాక్ ఉద్రిక్తత దృష్ట్యా రెండు రోజుల నుంచి అటువైపు విమానాలను మళ్ళించడం లేదు. దీనివలన పాకిస్తాన్ ఆదాయానికి భారీగా గండిపడే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం గురించి అంతర్జాతీయ మీడియా వార్తా కథనాలు రాసింది. 

విమానయాన సంస్థలకు భారీ గండి..

పాక్ గగనతలం మూసేయడంతో ఎయిర్ ఇండియాకు భారీ నష్టం వచ్చింది. ఒక్క ఎయిర్ ఇండియాకే ఏడాదికి రూ.5 వేలకోట్ల మేర నష్టం వాటిల్లనుంది. అయితే ఇది ఒక్క భారత్ కే  కాదు...పాక్ ఆదాయానికి కూడా అంతేస్థాయిలో గండిపడింది. వివిధ దేశాల విమానయాన సంస్థల నుంచి వచ్చే ఫీజులు కూడా తగ్గి పాక్‌ ప్రతి నెలా మిలియన్‌ డాలర్లను కోల్పోనుందని తెలుస్తోంది. 

భారత్‌ నుంచి అమెరికాలోని షికాగో, న్యూయార్క్‌, వాషింగ్టన్‌, శాన్‌ ఫ్రాన్సిస్కో, నెవార్క్‌ నగరాలతోపాటు కెనడాలోని టొరంటో, వాంకోవర్‌లకు ఎయిరిండియా విమానాలు నడుపుతోంది. అమెరికాలోని వివిధ ప్రాంతాలకు వారానికి 71 సర్వీసులను నడుపుతుండగా.. ఇందులో 54 సర్వీసులు కేవలం దిల్లీ నుంచే ఉన్నాయి. అయితే, పాక్‌ గగనతలం మూసివేయడంతో అరేబియా సముద్రం మీదుగా ప్రత్యామ్నాయ మార్గాల్లో భారత్‌ విమానాలు వెళ్తున్నాయి.

 pakistan | india | flights | today-latest-news-in-telugu ఇంటర్నేషనల్

Also Read: TS: 600 చ.అడుగులు మించకూడదు..ఇందిరమ్మ ఇళ్ళ కీలక అప్డేట్..

Advertisment
Advertisment
తాజా కథనాలు