TS: 600 చ.అడుగులు మించకూడదు..ఇందిరమ్మ ఇళ్ళ కీలక అప్డేట్..

ఇందిరమ్మ ఇళ్ల లభ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఇళ్లు విస్తీర్ణం 600 చదరపు అడుగులు మించకూడదని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో పట్టణ ప్రాంతంలో 500 ఇళ్లు నిర్మించాలని స్పష్టం చేశారు. 

New Update
Ponguleti Srinivas Reddy

Ponguleti Srinivas Reddy

ఇందిరమ్మ ఇళ్ళపై మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. ఇళ్ళ లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితా ఇన్ ఛార్జి మంత్రుల ఆమోదం పొందాలన్నారు. దాంతో పాటూ ఇళ్లు విస్తీర్ణం 600 చదరపు అడుగులు మించకూడదని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో పట్టణ ప్రాంతంలో 500 ఇళ్లు నిర్మించాలని స్పష్టం చేశారు. ఈ నెల 5 నుంచి 20 వరకు 28 మండలాల్లో భూభారతి సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. 

అనర్హులని తెలిస్తే..

సీఎస్‌ రామకృష్ణారావుతో కలిసి భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు, నీట్‌ పరీక్ష ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మంత్రి పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్లకు అన‌ర్హుల‌ని తేలితే ఇళ్ల నిర్మాణం మధ్యలో ఉన్నా సరే రద్దు చేస్తామని, జాబితా -1, జాబితా -2, జాబితా -3లతో సంబంధం లేకుండా నిరుపేదలను ఎంపిక చేయాలని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. 

దీంతో పాటూ ఈ నెల 4న జరగనున్న నీట్‌ పరీక్షకు ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని మంత్రి ఆదేశించారు. ఈ ఏడాది రాష్ట్రం నుంచి 72,572 మంది విద్యార్థులు నీట్‌ పరీక్షకు హాజరవుతున్నట్లు చెప్పారు.  24 జిల్లాల్లో 190 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప‌రీక్షా కేంద్రాల్లో తాగునీరుతో పాటు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, మెడికల్‌ కిట్‌లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.

 today-latest-news-in-telugu | indiramma illu | update | minister-ponguleti-srinivas 

Advertisment
Advertisment
తాజా కథనాలు