Conistable Crime: బరితెగించిన కానిస్టేబుల్.. బజారులో ప్యాంటు విప్పి దారుణం.. వీడియో వైరల్!

కామారెడ్డి జిల్లా బిక్నూర్‌ కానిస్టేబుల్ కేసులో మరిన్ని దారుణాలు బయటకొస్తున్నాయి. సొంత తమ్ముడి భార్య, పిల్లలపై సంతోష్ దాడి చేస్తుంటే స్థానికులు వీడియో తీశారు. దీంతో నడి బజారులోనే ప్యాంటు విప్పి తీసుకొండని చూపించాడు. ఇది వైరల్ అవుతోంది. 

New Update
conistable km

Kamareddy Biknoor constable case another video viral

Conistable Crime: కామారెడ్డి జిల్లా బిక్నూర్‌ కానిస్టేబుల్ కేసులో మరిన్ని దారుణాలు బయటకొస్తున్నాయి. సొంత తమ్ముడి భార్య, పిల్లలపై దాడి చేసిన సంతోష్ గౌడ్ పరమ దుర్మార్గుడని తెలుస్తోంది. వారిని కొడుతేంటే స్థానికులు వీడియో తీశారు. దీంతో నడి బజారులోనే ప్యాంటు విప్పి తీసుకొండని చూపించాడు. ఇది వైరల్ అవుతోంది. 

అసలేం జరిగిందంటే..

ఆస్తి పంపకాల విషయంలో ఏఆర్ కానిస్టేబుల్ సంతోష్ కు అతని సోదరుడు వేణుతో తరుచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం రాత్రి కూడా సంతోష్ ఈ విషయంలో వేణు ఇంటికి వచ్చి తన తల్లిదండ్రులతో గొడవకు దిగాడు. అయితే అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన వేణు భార్య  వీడియో రికార్డింగ్ చేస్తుండగా ఆమె ఫోన్ గుంజుకుని ఈ గొడవకు అసలు కారణం నువ్వేనంటూ ఆమెపై కర్రతో దాడి చేశాడు. అప్పుడే కారులో ఇంటికి వచ్చిన వేణు తన భార్యను కొట్టడంతో ఆగ్రహించి అన్న సంతోష్ పై దాడికి దిగాడు. గల్లాలు పట్టుకుని మరి ఇద్దరూ వీధుల్లో రౌడీల్లా రెచ్చిపోయి మరీ కొట్టుకున్నారు. వేణు స్నేహితులు సంతోష్ కు ఎంతో నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ అతను వినిపించుకోలేదు. 


Also read :  యూట్యూబ్ చూసి స్మగ్లింగ్ నేర్చుకున్నా..రన్యారావు స్టేట్ మెంట్

వేణు కారు అద్దాలను కూడా ధ్వంసం చేశాడు సంతోష్. అనంతరం బావ, మరదలు ఇద్దరు స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి పరస్పరం ఒకరిపై మరోకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వేణు భార్యను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అక్రమంగా ఇంట్లోకి చొరబడటమే కాకుండా మహిళపై దాడి చేసినందుకు గానూ కానిస్టేబుల్ సంతోష్ పై కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ డి ఆంజనేయులు వెల్లడించారు. 

Also Read :  పెరగనున్న ఇంజినీరింగ్ ఫీజులు.. ఈ కాలేజీల్లో మీ పిల్లలున్నారా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pregnant Woman Dies: హాస్పిటల్ సిబ్బంది తప్పుతో 2 ప్రాణాలు బలి.. ఏం జరిగిందంటే?

హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా గర్భిణీ చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జైపూర్‌లో మే 19న ఆసుపత్రిలో చేరిన మహిళ(23)కు వేరే గ్రూప్ రక్తం ఎక్కించారు.. బ్లడ్‌లో రియాక్షన్ మొదలై ఆమె మే 21న చనిపోయింది. వైద్యులు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారు.

New Update
Pregnant Woman Dies (1)

AI Genarated image

డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా గర్భిణీ చనిపోయింది. ప్రసవం కోసం హాస్పిటల్‌కు వెళ్లగా ప్రాణాలు బలిగొన్నారు సిబ్బంది. మహిళ మృతికి కారణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జైపూర్ ఆసుపత్రిలో 23 ఏళ్ల గర్భిణీ స్త్రీ మరణించింది. టోంక్ జిల్లాకు చెందిన గర్బిణీ మే 12న హిమోగ్లోబిన్ లెవల్స్ చాలా తక్కువగా ఉందని, టీబీ మరియు ఇతర ఆరోగ్య సమస్యలతో సవాయి మాన్సింగ్ ఆసుపత్రిలో చేరిందని అధికారులు తెలిపారు. ఆమె మే 21న మరణించింది. ఆమె బ్లడ్ గ్రూప్‌కు మ్యాచ్ కానీ రక్తం ఎక్కించారని బాధిత మహిళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటుండగానే ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.

మే 19న ఆమె బ్లడ్ గ్రూప్ A+ అని బ్లడ్ బ్యాంక్‌కి రక్త మార్పిడి కోసం వెళ్లారు. ఆమెకు A పాజిటివ్ బ్లడ్ ఎక్కించారు. తర్వాత రోజు ఆమె బ్లడ్ గ్రూప్ B పాజిటివ్ అని తెలిసింది. దీంతో ఆమె రక్తంలో రియాక్షన్ కనిపించింది. నెమ్మది నెమ్మదిగా ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. రక్తం ఎక్కించేటప్పుడు డాక్టర్ సెలవులో ఉన్నానని మీడియాతో చెప్పాడు. ఆమె ఇప్పటికే మిలియరీ టిబి కారణంగా తీవ్ర అనారోగ్యంతో ఉందని అన్నారు. వేరే బ్లడ్ గ్రూప్ రక్తం ఎక్కించడంతో జ్వరం, చలి, హెమటూరియా, టాచీకార్డియా వంటి లక్షణాలు వచ్చాయి. వేరే గ్రూప్ రక్తం ఎక్కించిన విషయం బాధితురాలి ఫ్యామిలీకి తెలియకుండా ఉంచారు హాస్పిటల్ సిబ్బంది. 

pregnant-woman | jaipur | blood group types | blood types | types of blood group | blood-groups | latest-telugu-news

Advertisment
Advertisment
Advertisment