/rtv/media/media_files/2025/08/22/kukatpalli-murder-case-2025-08-22-19-12-58.jpg)
Kukatpalli Murder Case
హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఇటీవల ఓ 12 ఏళ్ల బాలికను పదవ తరగతి చదువుతున్న బాలుడు దారుణంగా హత్య చేసినట్లు తాజాగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మర్డర్ జరిగిన రోజు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ ఫ్రం హోం చేస్తూ బాలుడుని చూశాడు. అతను పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అనుమానం వచ్చి బాలుడు చదువుతున్న స్కూల్కు వెళ్లారు. పొంతన లేని సమాధానాలు బాలుడు ఇవ్వడంతో అనుమానం వచ్చి ఇంటికి వెళ్లారు.
ఇది కూడా చూడండి: BIG BREAKING: కూకట్పల్లి హత్య కేసులో వీడిన మిస్టరీ.. హత్య చేసింది పదవ తరగతి విద్యార్థే
అనుమానం వచ్చి ఇంటికి వెళ్లి చూడగా..
ఆ బాలుడు ఇంట్లో బట్టలు, లెటర్, కత్తి వంటివి కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే బాలుడు ఎక్కువగా హార్రర్ సినిమాలు చూస్తాడని విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి సినిమాలు చూసి హత్యకు పాల్పడినట్లు సమాచారం. అయితే హత్య జరిగిన రోజు మూడు సార్లు గట్టిగా డాడీ అని పిలిచినట్లు వినిపించిందని ఆ బాలుడు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. అయితే ఈ కేసులో తనవైపు ఎలాంటి అనుమానం రాకూడదనే ఉద్దేశంతోనే ఇలా చెప్పినట్లు తెలుస్తోంది.
పదో తరగతి చదువుతున్న బాలుడు..
12 ఏళ్ల బాలికను హత్య చేసి పదో తరగతి బాలుడని పోలీసులు గుర్తించారు. అయితే బాలుడు దొంగతనం చేయడానికి వెళ్లగా ఆ బాలిక చూడటం వల్ల చంపేసినట్లు కూడా తెలుస్తోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పదో తరగతి చదువుతున్న ఈ బాలుడు బాలిక ఇంట్లోకి వెళ్లాడు. రూ.80 వేలు దొంగలించాడు. ఈ సమయంలో 12 ఏళ్ల బాలిక చూడటంతో వెంటనే ఆమె పీకపిసికి చంపేశాడు. ఆ తర్వాత చనిపోయిందని కన్ఫార్మ్ చేసుకోవడానికి కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. అయితే దొంగతనం ఎప్పుడు? ఎలా చేయాలి? ఎవరైనా చేస్తే ఏం చేయాలని కూడా ముందే ఆ బాలుడు ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తనకి వచ్చిన ఇంగ్లీషులో దొంగతనం వంటివి ఎలా చేయాలని నెట్ నుంచి వివరాలు సేకరించి వాటిని పేపర్పై రాసుకున్నాడు.
కేసు ఏంటంటే?
కూకట్పల్లిలో ఓ కుటుంబం ఉంటుంది. వీరికి కొడుకు, కూతురు అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే తండ్రి బైక్ మెకానిక్గా పనిచేస్తుండగా, భార్య ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తోంది. కొన్నేళ్ల నుంచి వీరు కూకట్పల్లిలోనే నివసిస్తున్నారు. అయితే ఓ రోజు ఇంట్లో తల్లిదండ్రులు లేకపోవడంతో ఓ 12 ఏళ్ల బాలిక హత్యకు గురైంది. కొడుకుకు బాక్స్ ఇవ్వడానికి తండ్రి ఇంటికి రావడంతో బెడ్ మీద కత్తిపోట్లతో కూతరు పడి ఉంది. దీంతో తండ్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అద్దెకు ఉంటున్న యువకుడిపై..
ఆ బాలిక ఇంటి పై పోర్షన్లో సంజయ్ అనే యువకుడు అద్దెకు ఉంటున్నాడు. అయితే ఇతని మీద అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తాను హత్య చేయలేదని, తనకేం తెలియని ఆ వ్యక్తి తెలిపాడు. దీంతో పోలీసులు విచారణ చేపట్టగా చివరకు మిస్టరీ వీడింది.
ఇది కూడా చూడండి: TG Crime: ప్రియుడి కోసం మొగుడ్ని చంపిన భార్య.. భూపాలపల్లి కోర్టు సంచలన తీర్పు!