Gujarat: భర్తను హతమార్చిన భార్య.. పెళ్లయిన నాలుగు రోజులకే..

పెళ్లయిన నాలుగు రోజులకే భర్తను భార్య హతమార్చిన దారుణ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. ఇష్టం లేకుండా తల్లిదండ్రులు పెళ్లి చేయడంతో.. తన ప్రియుడితో కలిసి ఈ కుట్ర పన్నింది. భార్య మీద అనుమానం వచ్చి పోలీసులు విచారించగా హత్య చేసినట్లు ఆ భార్య ఒప్పుకుంది.

New Update
crime..

ఇటీవల రోజుల్లో భర్త బాధితుల కంటే భార్య బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. ఇతరుల మోజులో పడి కొందరు భార్యలు సొంత భర్త ప్రాణాలు తీస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలంటి ఘటనలు రోజురోజుకి ఎక్కువ అవుతున్నాయి. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం.. పెళ్లయి ఎన్ని రోజులు కాకుండానే భర్తను హతమార్చడం ఈ తరం ఫ్యాషన్ అయిపోయింది. అయితే తాజాగా గుజరాత్‌లోని గాంధీనగర్‌లో కూడా ఇలాంటి దారుణ ఘటన చోటుచేసుకుంది. 

ఇది కూడా చూడండి:  పవన్, పుష్ప భేటీకి డేట్ ఫిక్స్.. మెగా వివాదానికి ఫుల్ స్టాప్!

ప్రేమికుడితో కలిసి..

పాయల్ అనే మహిళకు భావిక్ అనే వ్యక్తితో ఇటీవల పెళ్లయింది. పాయల్‌కు ఇది వరకే ప్రేమికుడు ఉన్నాడు. పెళ్లికి ముందు వారి ప్రేమ విషయం ఇంట్లో చెబితే.. పెద్దలు అంగీకరించలేదు. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న పాయల్ తన ప్రేమికుడితో కలిసి పెద్ద కుట్ర పన్నింది. పెళ్లయిన నాలుగు రోజులు కాకుండానే తన భర్తను హతమార్చాలని ఇద్దరూ ప్లాన్ చేసుకున్నారు. 

ఇది కూడా చూడండి:  తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత

ఈ క్రమంలో తనని పికప్ చేసుకోమని పాయల్ భావిక్‌కి చెప్పింది. దీంతో భావిక్ తనని తీసుకురావడానికి వెళ్తుండగా.. కల్పేష్ తన కొంత మందితో కలిసి అతన్ని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత భావిక్ గొంతు కోసేసి.. నర్మదా కాలువలో పడేశారు. ఇంటికి వస్తానని చెప్పిన భావిక్ రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.

ఇది కూడా చూడండి: భూమి లేని నిరుపేదలకు గుడ్ న్యూస్.. ఏటా రూ.12 వేలు

భార్య పాయల్‌పై అనుమానం రావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. చివరికి పాయల్ తన ప్రేమికుడు కల్పేష్‌తో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకుంది. దీంతో పోలీసులు వీరిద్దరితో పాటు వారికి సాయం చేసిన సహచరులను కూడా అరెస్టు చేశారు. పెళ్లయిన నాలుగు రోజులకే ఇలా కొడుకు మరణించడంతో భావిక్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. 

ఇది కూడా చూడండి:  'బిగ్ బాస్ సీజన్ 8' టైటిల్ విన్నర్ గా నిఖిల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు