/rtv/media/media_files/2025/09/12/boat-accident-2025-09-12-20-24-41.jpg)
BIG BREAKING: ఘోర పడవ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్య ఆఫ్రికా దేశం కాంగోలో ఘోర పడవ ప్రమాదం సంభవించింది. వాయువ్య కాంగోలోని ఎక్వాట్యూర్ ప్రావిన్స్లో పడవ బోల్తా పడిన ఘటనలో 86 మంది మరణించినట్లు ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. మరణించిన వారిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారని తెలిపింది. ఈ ప్రమాదం బుధవారం (సెప్టెంబర్ 10, 2025) రాత్రి జరిగిందని, ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చిందని అధికారులు తెలిపారు.
Also Read: Caste Income: గుడ్న్యూస్.. ఇక నుంచి క్యాస్ట్ ఇన్కమ్ సులభంగా పొందచ్చు
DRAME FLUVIAL DANS LA PROVINCE DE L’ÉQUATEUR
— BOKUTANI INFOS TV (@lutonda83) September 12, 2025
Au moins 86 personnes,dont plus d 60 élèves,ont tragiquement perdu la vie ds le naufrage d’un bateau motorisé survenu ds la soirée du mercredi 10 septembre, au confluent d rivières Nsolo et Baringa,dans le territoire de Basankusu pic.twitter.com/aRVkPKmWkq
పడవ సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, రాత్రిపూట ప్రయాణించడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు. కాంగోలో పడవ ప్రమాదాలు తరచుగా జరుగుతూ ఉంటాయి. దీనికి ప్రధాన కారణం శిథిలమైన పడవలు, భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం, ప్రయాణికులను అధికంగా ఎక్కించుకోవడం.ఈ ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు.
Also Read: Anushka Shetty: కొంతకాలం కనిపించను.. అనుష్క షాకింగ్ నిర్ణయం! వైరలవుతున్న లెటర్
పడవలో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారు, ఎంత మంది సురక్షితంగా బయటపడ్డారు అనే దానిపై పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. కాంగోలో రోడ్డు మార్గాలు సరిగా లేకపోవడం వల్ల అక్కడి ప్రజలు నదులు, సరస్సులలో పడవ ప్రయాణాలను ఆశ్రయిస్తుంటారు. అయితే, భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం, ఓవర్లోడింగ్, పడవ నిర్వహణ లోపాల వల్ల తరచుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి.
ఈ ఘటనతో కాంగో ప్రభుత్వం, అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నాయని తెలిపారు. ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేసి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయినప్పటికీ, కాంగోలో నిరంతరంగా జరుగుతున్న పడవ ప్రమాదాలు అక్కడి ప్రజల భద్రతపై తీవ్ర ఆందోళనలను పెంచుతున్నాయి.